ఆ రీమేక్ కు ముహుర్తం కుదిరిందా?

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన హిందీ చిత్రం 2 స్టేట్స్'. చేతన్ భగత్ రచించిన నవలాధారంగా 2014లో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాను నూతన దర్శకుడు వెంకట్ రెడ్డి తెలుగులో రూపొందించనున్నారు. అడివి శేష్ హీరోగా నటించబోతున్న ఈ చిత్రంతో.. సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కథానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది.

ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. అడివి శేష్ తల్లి పాత్రలో నిన్నటి తరం బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటించనున్నట్టు సమాచారం. 1989లో వచ్చిన బాలీవుడ్ మూవీ మైనే ప్యార్ కియా' (ప్రేమపావురాలు)లో సుమన్‌ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు భాగ్యశ్రీ. అంతేకాదు.. 1997లో డా.రాజశేఖర్ నటించిన ఓంకారం' సినిమాలో కీలకపాత్ర పోషించారు. అలాగే.. 1998లో బాలకృష్ణ నటించిన యువ‌ర‌త్న రాణా' చిత్రంలో కూడా ఓ కీలకపాత్రలో నటించారీమే. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల విరామం అనంతరం మళ్ళీ తెలుగులో నటిస్తున్నారు భాగ్యశ్రీ. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ బాణీలు సమకూరుస్తున్నారు.

More News

భ‌ర‌త్ అనే నేను.. ఆ రెండూ కీల‌క‌మే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌మైక్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్న చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. 'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

20వ కళాసుధ అవార్డుల ప్రధానం

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది.

న‌య‌న‌తార‌ 'క‌ర్త‌వ్యం'.. ఉగాది సంద‌ర్బంగా మార్చి 16న విడుద‌ల

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ ల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా  ట్ĸ

'వైశాఖం' చిత్రానికి ఎక్కువ అప్రిషియేషన్‌ తో పాటు అవార్డులు రావడం చాలా హ్యాపీగా ఉంది - జయ బి

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ, వి టీమ్‌, జె వరల్డ్‌ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.

సినిమా బాగా లేకపోతే.. టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం : 'సత్య గ్యాంగ్‌' నిర్మాత

సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేశ్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్‌'.