రూ.20 లక్షలను కాల్చేసిన తహసీల్దార్..

  • IndiaGlitz, [Friday,March 26 2021]

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 లక్షల రూపాయలను భార్య సాయంతో కాల్చిపడేశాడో తహసీల్దార్. తిండిలేక.. నిలువ నీడలేక ఎందరో ఇబ్బంది పడుతున్నారు కదా వారికి ఇచ్చేయవచ్చు కదా అనిపిస్తోంది. ఆ సమయంలో అంత ఆలోచన అయితే వచ్చి ఉండదు. అసలు విషయంలోకి వెళితే రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో కల్పేశ్ కుమార్ జైన్ అనే వ్యక్తి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు.
ఆయన వద్ద పని చేసే పర్వత్ సింగ్ అనే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ తాజాగా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

అధికారులు పర్వత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ చెప్పడంతోనే తానీ డబ్బులు తీసుకున్నట్టు చెప్పాడు. దీంతో అధికారులు అతడిని తీసుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి బయలుదేరారు. సమాచారం అందుకున్న కల్పేశ్ వెంటనే ఇంటి తలుపులు మూసివేసి.. భార్య సహకారంతో వంట గదిలోని స్టవ్‌పై లంచంగా తీసుకున్న 20 లక్షల రూపాలయను కాల్చడం ప్రారంభించాడు. కాల్చడం పూర్తి కాక ముందే అక్కడికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు.

ఇంటి లోపలి నుంచి నోట్ల కట్టలను కాలుస్తున్న వాసన రావడాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు డబ్బులు కాల్చొద్దని కల్పేశ్, అతడి భార్యను వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోకుండా కల్పేశ్ మొత్తం డబ్బులను కాల్చేశాడు. ఈలోపు ఎలాగోలా ఇంట్లోకి చేరుకున్న అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే రూ. 20 లక్షలను కాల్చి బూడిద చేసినట్టు గుర్తించారు. మిగిలిన రూ. 1.5 లక్షలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

More News

‘ఉప్పెన’ దర్శకుడికి భారీ గిఫ్ట్ అందజేసిన నిర్మాతలు

లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుని.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘ఉప్పెన'.

సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐపై స్పందించిన రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రఘురామ కృష్ణరాజు వివరణ ఇచ్చారు.

అసెంబ్లీలో నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి

ప్రతీచోట సరదాగా మాట్లాడుతూ నవ్వించే వారు ఉంటూనే ఉంటారు. సీరియస్‌గా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీలో మంత్రి చామకూర మల్లారెడ్డి నవ్వుల పువ్వులు పూయించారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. స్పందించిన చిరు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు పెట్టిన విషయం తెలిసిందే. నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు.