అయోధ్య రాములోరి సేవలో సినీ ప్రముఖులు

  • IndiaGlitz, [Monday,January 22 2024]

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం సమీపించింది. మరికొద్ది సేపట్లో జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన జరగనుంది. కాశీకి చెందిన ప్రముఖ జ్ఞానేశ్వర్ శాస్త్రి లక్ష్మీకాంత్ దీక్షితులు ఆధ్వర్యంలో రామాలయ ప్రతిష్టాపన పూజలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు అయోధ్యకు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులు దేశవ్యాప్తంగా దాదాపు 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానం పంపించారు.

దీంతో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన సినిమా సెలబ్రిటీలు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్, రణబీర్ కపూర్, జాకీ ష్రాఫ్, కంగనా, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్, సైనా నెహ్వాల్, సీఎం యోగి, సచిన్ టెండూల్కర్, రాజ్ కుమార్ రావు.. ఇలా చాలా మంది ప్రముఖులు విచ్చేశారు.

వీరితో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. భారీగా ప్రముఖులు అయోధ్యకు చేరుకోవడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 13 వేల మంది భద్రతా బలగాలు అయోధ్య చుట్టూ పహారా కాస్తున్నాయి. యూపీ పోలీసులు, సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠను పురస్కరించుకుని అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో వేడుకలు జరిగాయి. ఇక్కడ భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా రామాలయంలా తలపిస్తోంది. ఇక ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, లండన్, ఆస్ట్రేలియా ఇలా అనేక దేశాల్లోని భారతీయులు రాములోరి ప్రాణప్రతిష్ట వేడుకలు చేసుకుంటున్నారు.

More News

PM Modi: అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ట..

ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు కాసేపట్లో మోక్షం లభించనుంది. వేల మంది సమక్షంలో ప్రధాని మోదీ అయోధ్య బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేయనున్నారు.

దళితులపై మరోసారి వివక్ష.. అంబేద్కర్‌పై విషం వెళ్లగక్కిన పెత్తందార్లు..

దళితులు అంటే పెత్తందారులకు ఎంత చులకనో మరోసారి బహిర్గతమైంది. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఆవిష్కరించారు.

Ram Mandir: రాములోరి ప్రాణప్రతిష్టకు ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు ఎవరంటే..?

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన సంప్రదాయ క్రతువులు జరుగుతున్నాయి.

YS Jagan: అంటరానితనం రూపు మార్చుకుంది.. సీఎం జగన్ ప్రసంగంపై ప్రశంసలు..

విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహంగా పేరు గడించింది.

KTR:కరెంట్ బిల్లులు కట్టకండి.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.