'మామ్' సెన్సార్ పూర్తి - జూలై 7 విడుదల

  • IndiaGlitz, [Tuesday,June 27 2017]

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై 'మామ్‌' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సెన్సార్‌ బోర్డ్‌ ఛీఫ్‌ పహ్లజ్‌ నిహ్లాని 'మామ్‌' చూసి తను పొందిన అనుభూతిని తెలియజేస్తూ.. ఈ చిత్రాన్ని న్యూ ఏజ్‌ మదర్‌ ఇండియాగా చెప్పొచ్చు.
ఇందులో శ్రీదేవి అభినయం నర్గీస్‌ను గుర్తు తెచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టాల్సిందేనని సెన్సార్‌ సభ్యులు అన్నారు. మంచి కథ, కథనాలతో రవి ఉద్యవర్‌ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా రూపొందించారని, శ్రీదేవి నటన ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అని ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌

More News

'యువర్స్ లవింగ్లీ' ఫస్ట్ లుక్ రిలీజ్

యువ ప్రతిభాశాలి 'జో' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృద్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సందేశమిళిత వినోదాతాత్మక చిత్రం "యువర్స్ లవింగ్లీ".

జూలై నెలాఖరున 'కథలో రాజకుమారి'

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి".

జూలై 7న డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్ టైన్ మెంట్ 'రాక్షసి'

పూర్ణ ప్రధాన పాత్రలో డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పన్నా రాయల్ దర్శకత్వంలో 'కాలింగ్ బెల్' చిత్రానికి సీక్వెల్గా అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ జన్ను నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్టైనర్ 'రాక్షసి'. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

'ఏజంట్ భైరవ' జూలై 7న విడుదల

పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్ భైరవ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కాస్తా ఆందోళనలో ఉన్నారట. అందుకు కారణం ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం `జై లవకుశ` ఎంత మాత్రం కాదు. అసలు విషయమేమంటే