డిసెంబర్ లో మోహన్ లాల్ 'మన్యం పులి'

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మళయాల సీమలో భారీ కలెక్షన్స్ తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జోరున కొనసాగతోంది. ఇప్పటివరకు 100 కోట్లకి పైగా వసూళ్ల రాబట్టి మల్లూవుడ్ లోనే కాదు మోహన్ లాల్ కెరీర్ లో సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పులిమురుగన్. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ సర్వసతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖనిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే నవంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితుల రిత్య వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. అలానే డిసెంబర్ నెలలో మరో విడుదల తేదీని ఫిక్స్ చేసి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకుంటోన్న మన్యం పులి' తెలుగులో సైతం సెంట్ పర్సెంట్ సక్సెస్ అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. .దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీసుందర్, కెమెరా : షాజీ కుమార్

More News

రజనీకాంత్ తో త్రిష....

పా రంజిత్ తన దర్శకత్వంలో డాన్ క్యారెక్టర్ లో రజనీకాంత్ నటించిన చిత్రం 'కబాలి'.

బాలయ్య రైతుకు బిగ్ బి నో చెప్పడానికి కారణం..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ వైపు 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం చేస్తూనే మరో వైపు 101వ చిత్రం చర్చల్లో పాల్గొంటున్నారు.

రజనీకాంత్ కు అక్కడేం పని....

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్,ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం '2.0' సీక్వెల్ ఆఫ్ రోబో.

'ఎంత వరకు ఈ ప్రేమ' రిలీజ్ డేట్

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా

'చిత్రాంగద' హక్కులను దక్కించుకున్న....

వెంకట్ వాడపల్లి,టి.సి.యస్.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా బ్యానర్ పై అంజలి,దీపక్,సింధుతులాని ప్రధాన పాత్రధారులుగా