కిమ్స్ కి చేరుకున్న మోహ‌న్ బాబు..!

  • IndiaGlitz, [Tuesday,January 31 2017]

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కిడ్నీ మ‌రియు ఊపిరితిత్తుల వ్యాధితో గ‌త కొన్ని రోజులు నుంచి బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌నకు కిమ్స్ హాస్ప‌ట‌ల్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దాస‌రి ఆరోగ్యం పై హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసారు. దాస‌రికి ఆరోగ్యం బాగోలేద‌ని విష‌యం తెలిసిన వెంట‌నే మోహ‌న్ బాబు, జ‌య‌సుధ‌ దాస‌రిని చూసేందుకు కిమ్స్ కు చేరుకున్నారు.

దాస‌రికి వెంటిలేట‌ర్ పై చికిత్స అందిస్తున్నారు. వైద్యులు మరికాసేప‌ట్లో దాస‌రికి ఆప‌రేష‌న్ చేయ‌నున్నారు. ఆప‌రేష‌న్ అనంత‌రం దాస‌రి ఆరోగ్య‌ ప‌రిస్థితి పై మ‌రోసారి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామ‌ని తెలియ‌చేసారు.