ఫిబ్రవరి 9న విడుదల కానున్న మోహన్ బాబు 'గాయత్రి'

  • IndiaGlitz, [Thursday,December 14 2017]

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న 'గాయత్రి' చిత్రాన్ని ఫిబ్రవరి 9 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ షూటింగ్ నేటితో పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విష్ణు సరసన శ్రియ నటించగా, ఇటీవలే వీరిరువురిపై కీలక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు.

నిఖిలా విమల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, నిర్మాతలు ఫిబ్రవరి 9, 2018 ను విడుదల తేదీగా ఖరారు చేసారు. ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

More News

ఆయ‌న‌తో సూర్య మూడోసారి..?

తెలుగు, త‌మిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న తాజాగా నటించిన చిత్రం గ్యాంగ్ ఈ సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత సూర్య సెల్వ రాఘ‌వ‌న్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు.

సూర్య డ‌బ్బింగ్ చెప్పాడా?

హీరో సూర్య 'గ్యాంగ్' సినిమాతో వ‌చ్చే సంక్రాంతికి సంద‌డి చేయ‌బోతున్నాడు. విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌కుడు. త‌మిళంలో తెరకెక్కిన 'తానా సెంద కూట్ట‌మ్' సినిమాను తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుద‌ల చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ర‌కుల్ మ‌ల్టీస్టార‌ర్‌...

ఈ ఏడాది విన్న‌ర్, రా రండోయ్ వేడుక చూద్దాం, జ‌య జాన‌కి నాయ‌క‌, స్పైడ‌ర్‌, ఖాకి చిత్రాల్లో సంద‌డి చేసింది ర‌కుల్ ప్రీత్‌. ఈ అమ్మ‌డుకి ఈ ఏడాదిలో ఐదింట రెండు మాత్ర‌మే పెద్ద హిట్స్ సాధించాయి.

అడివి శేష్ డిస‌ప్పాయింట్‌...

హీరోగా, విల‌న్‌గా, న‌టుడిగా రాణిస్తున్న అడివిశేష్ త్వ‌ర‌లోనే 'గూఢ‌చారి' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. క్ష‌ణం త‌ర్వాత అడివిశేష్ మ‌రో సినిమా చేయ‌లేదు.

కొత్త బిజినెస్‌లోకి చ‌ర‌ణ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ సినిమాల్లోనే కాకుండా ఎయిర్ వేస్‌లో పార్ట్‌న‌ర్‌గా ఉంటున్నాడు. బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నాడు. తాజాగా త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ కొత్త‌గా బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.