MLC Notification: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. నోటిఫికేషన్ విడుదల

  • IndiaGlitz, [Thursday,May 02 2024]

తెలంగాణలో ఓవైపు పార్లమెంట్ ఎన్నికల హడావిడి నడుస్తుంటే.. మరోవైపు వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. మే 9 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. ఇక ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉపఎన్నిక కోసం నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. దీంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నల్గొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

కాగా గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉపఎన్నిక నిర్వహించాలన్న నిబంధన మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. కాగా 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వగా.. 2027 మార్చి వరకూ ఆయన పదవీకాలం ఉంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నికలో గెలిచిన అభ్యర్థి మరో మూడు సంవత్సరాలు పాటు పదవిలో ఉండనున్నారు.

ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ బరిలో దిగారు. 2021 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తారనే ప్రచారం జరగ్గా.. వెలిచాల రాజేందర్ రావును కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది.

More News

Voters in AP: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ నియోజకవర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్..

ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. సర్వీస్ ఓటర్లు 65,707గా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు.

ప్రధాని మోదీపై పోటీ చేస్తానంటున్న కమెడియన్.. ఎందుకో తెలుసా..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి సినీ, క్రీడా ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారు. మరోవైపు సామాన్యులు కూడా కీలక నేతలపై స్వతంత్ర

Sharmila: 'నవ సందేహాల' పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

సీఎం జగన్‌కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'నవ సందేహాల' పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీల గురించి 9 ప్రశ్నలతో ఓ లేఖ రాయగా.. తాజా లేఖలో ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

Kavitha:లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బెయిల్ కోసం మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.

Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అయిపోయింది.. జగన్‌ను ఇక ఇంటికి పంపడమే: పవన్

జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది.. ఇక ఇంటికి పంపడమే మిగిలింది అని జనసేన అధినేత వపన్ కల్యాణ్ తెలిపారు. ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురంలో బుధవారం నిర్వహించిన వారాహి