'మిఠాయి' ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న ఫిక్స్‌లాయిడ్‌

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం 'మిఠాయి'. ప్ర‌శాంత్‌కుమార్ ద‌ర్శ‌కత్వంలో ప్ర‌భాత్‌కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  నఈ సినిమా ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ సంస్థ ఫిక్స్‌లాయిడ్ ద‌క్కించుకుంది.

ఈ సంద‌ర్భంగా..

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌శాంత్ కుమార్ మాట్లాడుతూ ''సినిమా అనుకున్న విధంగా పూర్త‌వుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగ విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, క‌మ‌ల్ కామరాజు ముఖ్య‌పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు.

సాకేత్ సౌర‌భ్ ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా ....'పెళ్ళిచూపులు' సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌టం విశేషం. డార్క్ కామెడి జోన‌ర్‌లో విభిన్నమైన క్యారెక్ట‌ర్స్ న‌డుమ సాగే సినిమా ఇది. ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను ఫిక్స్ లాయిడ్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకుంది. వీరి సహ‌కారంతో ఓవ‌ర్‌సీస్‌లో కూడా మిఠాయి ఎక్కువ రీచ్ ఉంటుంద‌ని భావిస్తున్నాం'' అన్నారు.

ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, క‌మ‌ల్ కామ‌రాజు, భూష‌ణ్ క‌ల్యాణ్‌, ఆర్ష‌, అదితి మ్యాక‌ల్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం:  వివేక్ సాగ‌ర్‌, కెమెరా:  సాకేత్ సౌర‌భ్‌, ఎడిటింగ్‌:  వీను భూష‌ణ్ వెయిడ్‌, కొరియోగ్ర‌ఫీ:  అని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కృష్ణ వోడ‌ప‌ల్లి. నిర్మాత‌:  డా.ప్ర‌భాత్ కుమార్‌, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌శాంత్ కుమార్‌. 

More News

పోస్ట్ ప్రొడక్షన్ లో 'రాజు గాడు'

'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా

క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో 'పంతం'

టాలీవుడ్‌యాక్ష‌న్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై

ప‌వ‌న్‌కు అత్త‌గా.. బ‌న్నీకి త‌ల్లిగా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో అత్తారింటికి దారేది ఒక‌టి.

రూటు మారుస్తున్న కొర‌టాల‌

కొర‌టాల శివ‌.. వ‌రుస‌గా నాలుగు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న తెలుగు ద‌ర్శ‌కుడి పేరిది.

డిటిఎస్ మిక్సింగ్ ప‌నుల్లో 'అమ్మ‌మ్మ‌గారిల్లు'

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`.