Mallareddy: గత స్మృతులు గుర్తుచేసుకుంటూ 40ఏళ్ల నాటి స్కూటర్‌పై మంత్రి మల్లారెడ్డి చక్కర్లు

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. విజయదశమి సందర్భంగా ఆయన తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్ల క్రితం పాలు అమ్మిన స్కూటర్‌పై చక్కర్లు కొట్టారు. యువకుడిగా ఉన్న సమయంలో బోయినపల్లిలో ఏ స్కూటర్‌పై అయితే పాలు అమ్మారో.. ఆ స్కూటర్‌కు ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం దానిని కాసేపు నడిపి నాటి జ్ఞాపకాలను మరోసారి నెమరేసుకున్నారు. గతంలో ఓ సందర్భంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డానంటూ మల్లారెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి విషయం తెలిసిందే. దాంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఓ సెలబ్రెటీగా మారిపోయారు.

మల్లారెడ్డి ఏం మాట్లాడిన వైరల్..

అప్పటి నుంచి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రాజకీయ సభల్లో ఆయన వ్యాఖ్యలు అందరినీ నవ్విస్తూ ఉంటాయి. మంత్రి కేటీఆర్ సైతం మల్లన్న మాట్లాడిన తర్వాత మనం మాట్లాడటానికి ఏం ఉండదని వ్యాఖ్యానించారు. అంతలా మల్లారెడ్డి స్పీచులు ఇస్తూ ఉంటారు. కాలేజీలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు. అయినా కూడా గతం మర్చిపోకుండా పాలు అమ్మిన స్కూటర్‌కు పూజలు చేసి నడపడంపై నెటిజన్లు నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం..

ఇక మల్లారెడ్డి రాజకీయాల విషయానికొస్తే ఆయన టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయ్యారు. ఇప్పుడు మరోసారి అదే సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరి స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుపై పోటీకి దిగారు.

More News

Jaggareddy: నేనే సీఎం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి..

Nara Bhuvaneswari: 'నిజం గెలవాలి' పేరుతో పరామర్శ యాత్రకు రంగంలోకి దిగిన నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజకీయ రణరంగంలో అడుగుపెట్టారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లోకి వచ్చారు.

Ram Charan-Upasana: సంప్రదాయానికి పెద్ద పీట.. స్త్రీ శక్తికి వందనం, వారితో కలిసి దసరా వేడుకల్లో చరణ్ దంపతులు

పెద్దింట్లో పుట్టినా, గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా రామ్ చరణ్ తన మూలాలను మరిచిపోలేదు. మోడ్రన్‌గా కనిపిస్తూనే, సాంప్రదాయాలకు సైతం విలువనిస్తారు చెర్రీ. అంతేకాదు..

Bigg Boss Telugu 7: మరోసారి టార్గెట్ అయిన భోలే.. పెద్దన్నయ్యలా శివాజీ, హీటెక్కించిన నామినేషన్స్

బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం పూజా మూర్తి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో వరుసగా ఏడుగురు అమ్మాయిలు

Pawan Kalyan: ఏపీకి పట్టిన వైసీపీ తెగులుకు టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరం: పవన్ కల్యాణ్

ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందని.. అది పోవాలంటే టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమండ్రిలో