AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

  • IndiaGlitz, [Monday,February 12 2024]

డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్ చేశారు. 6,100 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం https://apdsc.apcfss.in/ పేరుతో అధికారిక వెబ్ సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. నోటిఫికేషన్, వివిధ కేటగిరీల వారీగా ఖాళీలు, దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు, ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాల సమాచారం ఇందులో అందుబాటులో ఉంటాయి. అలాగే cse.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ వివరాలు తెలుసుకోవచ్చు.

ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 283, విజయనగరం జిల్లాలో 284, విశాఖపట్నం 329, తూర్పు గోదావరి 392, పశ్చిమగోదావరి 306, కృష్ణా 279, గుంటూరు 416, ప్రకాశం 503, నెల్లూరు 346, చిత్తూరు 336, కడప 386, కర్నూలు జిల్లాలో 1693 పోస్టులున్నాయి. ఈ పోస్టులతో పాటు పీజీటీ 215, ప్రిన్సిపాల్ పోస్టులు 42.. విద్యాశాఖలో ఎస్టీజీ పోస్టులు 2,000, గిరిజన సంక్షేమ శాఖలో 280 పోస్టులున్నాయి. విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్లు 2,060, గిరిజన శాఖలో 226 ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 13 పోస్టులున్నాయి.

నేటి నుంచి ఈనెల 22 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నెల 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఇక మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం‌ 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్‌గా...మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్‌గా పరీక్షలు నిర్వహిస్తారు.

మార్చి 31న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేయనుండగా.. అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 1 వరకూ అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2న తుది ఆన్సర్ కీ.. ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల చేస్తారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుంది. అలాగే జనరల్ అభ్యర్ధులకు 44 ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించగా.. రిజర్వుడు అభ్యర్ధులకు మరో ఐదేళ్ల వెసులుబాటు కల్పించారు.

More News

Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు.. హరీష్‌ రావు కౌంటర్..

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Uttam Kumar Reddy: కృష్ణా నది జలాల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదు: ఉత్తమ్

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కృష్ణా నదీ జలాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

Harish Shankar: దుమ్మురేపుతోన్న 'ఈగల్' కలెక్షన్స్.. వారికి హరీశ్ శంకర్ కౌంటర్..

మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ తొలి ఆట నుంచే హిట్ టాక్‌ తెచ్చుకుంది.

చంద్రబాబు కోసం రామోజీరావు తంటాలు.. ఎంతలా దిగజారారంటే..?

రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి వైసీపీ ప్రభుత్వానికే పట్టం కట్టేందుకు సిద్ధంగా

Tirupathi: తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఈసీ వేటు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో దొంగ ఓట్ల వ్యవహారంలో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా దీనిపై దృష్టి పెట్టి అధికారులపై వేటు వేస్తోంది.