ప్రభాస్, ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబో.. మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్!

రోజు రోజుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న బడా దర్శకులు ప్రభాస్ డేట్స్ దొరికితే చాలు అన్నట్లుగా ఉన్నారు. కానీ రాబోవు నాలుగైదేళ్ల కోసం కొందరు దర్శకులు ప్రభాస్ ని ఇప్పటికే లాక్ చేశారు. బాహుబలి చిత్రం ప్రభాస్ సత్తాని నార్త్ కు పరిచయం చేసింది.

ఇదీ చదవండి: 400 ట్రైబల్ కుటుంబాలకు అండగా భల్లాల దేవుడు!

నిరాశపరిచినప్పటికీ సాహో కూడా నార్త్ లో వసూళ్ల వర్షం కురిపించింది. దీనితో ప్రభాస్ దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సాలార్ చిత్రాల్లో నటిస్తున్నాడు. సాలార్ చిత్రం క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

తాజాగా మతిపోగోట్టే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. అదే ప్రభాస్ 25వ చిత్రం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ తెరకెక్కే ఈ చిత్ర కాన్సెప్ట్ ఊహకు అందని విధంగా ఉంటుందట.

బాహుబలిని మించేలా ఓ మైథాలజీ (పురాణ గాధ) కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం ప్రీప్రోడుక్షన్ వర్క్, ప్లానింగ్ కనీవినీ ఎరుగని విధంగా ఉండబోతోంది.

ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ లేని విధంగా ప్రశాంత్ నీల్ ఈ మైథాలజీ కథని చెక్కబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్ కు ప్రిపరేషన్ బాగా అవసరం. కాబట్టి ప్రభాస్ ముందుగా తాను కమిటై ఉన్న రాధే శ్యామ్, సాలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ చిత్రాలని పూర్తి చేస్తాడు. ఈ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ షురూ అయ్యింది.

More News

400 ట్రైబల్ కుటుంబాలకు అండగా భల్లాల దేవుడు!

కరోనా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ దాతృత్వం చాటుకుంటున్నారు.

'రంగస్థలం' బ్యూటీ, క్రేజీ సింగర్ జంటగా 'మనిషి'.. ఫస్ట్ లుక్ రిలీజ్

నటుడిగా, సింగర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు నోయల్. నోయెల్ గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.

యంగ్ డైరెక్టర్ కు మైత్రి బంపర్ ఆఫర్.. రాంచరణ్ తో మూవీ!

తన విభిన్నమైన స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ తో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు.

బాలయ్య 'అఖండ' పోస్టర్: మెలితిరిగిన మీసం.. రాజసం ఉట్టిపడే నడక

నందమూరి బాలకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ కాస్త ముందుగానే ప్రారంభం అయ్యాయి. బాలయ్య రేపటితో అంటే జూన్ 10న 61వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

గాంధీ ముని మనవరాలికి 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.3 కోట్ల చీటింగ్ చేసి.. 

జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.