మార్చి 18న వస్తున్న 'మేము'

  • IndiaGlitz, [Tuesday,March 01 2016]
సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రాన్ని "స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2 డి ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై.. తెలుగులో హీరో సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న "మేము" చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... "సూపర్ స్టార్ సూర్య, స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాల సంయుక్త సమర్పణలో "మేము" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలతో కలిసి కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా "పసంగ 2" అని తమిళ మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా సైతం తీర్మానించిన గొప్ప సినిమా ఇది. ఈ సినిమాకి వచ్చినన్ని మంచి రివ్యూలు, రేటింగ్స్ ఈ మధ్య కాలంలో మరే సినిమాకు రాలేదు. తమిళంలో ఈ చిత్రాన్ని సూర్య నిర్మించారు. వరుస విజయాలతో తమిళంలో సంచలన దర్శకుడిగా పేరొందిన పాండిరాజ్ "మేము" చిత్రంతో తన ప్రతిభాపాటవాలను మరోసారి అత్యంత ఘనంగా నిరూపించుకున్నారు. మార్చి18న ఈ చిత్రాన్ని అత్యధిక దియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది" అన్నారు.

More News

ప్రేమకథకు ఓకే చెప్పిన హేబా...

కుమారి 21ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ యూత్ కు దగ్గరైన హీరోయిన్ హేబాపటేల్ ఇప్పుడు విష్ణు హీరోగా,

ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్నమనోజ్ డైరెక్టర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మెగా హీరో మూవీలో అనసూయ...

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై..అనతి కాలంలోనే బాగా పాపులర్ అయిన యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయ.

నాని న్యూమూవీ టైటిల్..

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

విక్టరీ తో జతకడుతున్న కాజల్...

విక్టరీ వెంకటేష్...ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు...బంగారం సినిమాలో నటిస్తున్నారు.