జూలై 1న వస్తున్న 'మేము'

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను "స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2 డి ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న "మేము" చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... "సూపర్ స్టార్ సూర్య-స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాల సంయుక్త సమర్పణలో "మేము" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. "ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలతో కలిసి కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా ఇది" అని తమిళ మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా సైతం ముక్త కంఠంతో తీర్మానించిన గొప్ప సినిమా ఇది. వరుస విజయాలతో తమిళంలో సంచలన దర్శకుడిగా పేరొందిన పాండిరాజ్ "మేము" చిత్రంతో తన ప్రతిభాపాటవాలు మరోసారి నిరూపించుకున్నాడు. జూలై 1న ఈ చిత్రాన్ని అత్యధిక దియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది" అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అర్రోల్ కొరెల్లి, చాయాగ్రహణం: బాలసుబ్రమణియన్, మాటలు-పాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: "సూపర్ స్టార్" సూర్య-కె.ఇ. జ్ఞాన వేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: పాండిరాజ్!!

More News

మెగాస్టార్ 150వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

మెగాభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైనా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

వాళ్ల‌ను ఎందుకు హీరోయిన్స్ గా తీసుకుంటున్నారో్ అర్ధం కావ‌డం లేదు - చాందిని చౌద‌రి

సుధాక‌ర్, సుధీర్, చాందిని చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా  వ‌ర ముళ్ల‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కుంద‌న‌పు బొమ్మ‌.  విభిన్న ప్రేమ క‌థా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రామ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తాజాగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

మ‌హాన‌టి పాత్ర‌లో బాలీవుడ్ తారలా..?

ఇటు ప్రేక్షకులు, విమర్శకులతో ‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని తీసి మెప్పు పొందిన దర్శకుడు నాగ అశ్విన్. ఇప్పుడు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మహానటిగా తనకంటూ ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న మహానటి సావిత్రికి పై బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు.

శ్రియ త‌న‌యుడిగా నారారోహిత్‌...?

సినిమాల్లో ఏదైనా సాధ్య‌మే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు, సుసాధ్యాన్ని అసాధ్యంగా చూపిస్తారు. ఒకే వ‌య‌సున్న వారిని తండ్రికొడుకులుగా, త‌ల్లికొడుకులుగా ఇలా ఏలాగైనా చూపించ‌డం సినిమాల్లోనే సాధ్యం. ఇప్పుడు అలాంటి వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది.