మేము పక్కా లోకల్ పోస్టర్ లాంచ్..

  • IndiaGlitz, [Friday,October 27 2017]

విక్రమ్ ఆర్ట్స్ సమర్పించు విఖ్యాత హరితవనం" మేము పక్కా లోకల్" దద్దరిల్లే జానపదం అనే క్యాప్షన్ తో 45 మంది బుల్లితెర కళాకారులతో మొట్ట మొదటిసారిగా జానపద ఆట పాటల కార్యక్రమాన్ని జి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా విక్రమ్ ఆదిత్య రెడ్డి నిర్మాణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము పక్కా లోకల్ అనే పోస్టర్ ను ఎమ్ ఎల్ ఎ. రసమయి బాలకిషన్ చే ఆవిష్కరించారు.

అనంతరం రసమయి మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విక్రమ్ ఆడిత్యను, నిర్మాత జి.శ్రీధర్ రెడ్డిని అభినందిస్తున్నా.. మేము లోకల్ అని చెప్పుకోవడానికి 50 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ కళాకారులను నిలబెట్టడానికి గతంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాము. జాన పదం అంటే శ్రమలో నుంచి పుట్టిన పదంమే జానపదం. కలిపించి వ్రాసే పాటకాదు జానపదం అంటే. పాటకు అడుగులు కలిపే ఈ మంచి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మన అందరిలో ఉందని కోరుతున్నా... అన్నారు.

నిర్వాహకుడు విక్రమ్ ఆదిత్య మాట్లాడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన రసమయి బాలకిషన్ గారికి నా కృతజ్ఞతలు. మరుగున పడుతున్న జానపద పాటలను మళ్లీ వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ కాన్సెప్ట్. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా...అన్నారు. నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మంచి కార్యక్రమాన్ని తలపెట్టాము. జానపదాలు బ్రతకాలనే ఉద్దేశ్యం తో చేస్తున్న కార్యక్రమాన్ని ఆదరించాలని కోరుతున్నా అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో టివి నటి జ్యోతి రెడ్డి, అనూష, శ్రీవాని, ప్రభాకర్ ( బతుకమ్మ దర్శకుడు) తదితరులు పాల్గొన్నారు.

More News

సుమంత్ నూతన చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న  హీరో అక్కినేని సుమంత్. ఆయన  హీరోగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది.

నాగ శౌర్య కొత్త చిత్రం టైటిలిదే..

"ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌వైభోగం"," జ్యోఅచ్చుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాయించాడు నాగ‌శౌర్య.

వెలుగులోకి మరో స్వామిజి రాసలీలల బాగోతం

బెంగుళూరు లో ఉన్న ఓ మఠంలో స్వామిజీ రాసలీలల వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ నిర్మాత పివిపికి పితృ వియోగం

ప్రముఖ పారిశ్రామికవేత్త-నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) నేడు దివంగతులయ్యారు.

విలేకరి ప్రశ్నకి అదిరిపోయే సమాధానమిచ్చిన సూపర్ స్టార్

రజనీకాంత్-అక్షయ్ కుమార్-శంకర్ ల చిత్రం 2.0 ఆడియోని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు దుబాయ్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.