60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న 'మేళా'

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. ఈ సినిమా ప్రెస్‌మీట్‌ బుధవారం హైదరాబాద్‌ సారథి స్టూడియోలో జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో...

నిర్మాత సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''విభిన్నమైన కథ, కథనంతో కూడిన చిత్రమిది. నిజ ఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. దర్శకుడు కిరణ్‌గారు సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నారు'' అన్నారు.

డైరెక్టర్‌ కిరణ్‌ శ్రీపురం మాట్లాడుతూ - ''2006లో ముంబైలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇందులో కథానుగుణంగా ధన్సిక, సూర్యతేజ, సోని చరిష్టా..తదితర క్యారెక్టర్స్‌కు రెండు, మూడు వెర్షన్స్‌ ఉంటాయి. సినిమా అనుకున్న దాని కంటే బాగా వస్తుంది. ప్రస్తుతం క్లైమాక్స్‌ లీడ్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కఉతున్న ఈ సినిమా 50-60 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే ట్రైలర్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. ట్రైలర్‌ చూస్తే, అసలు ఈ టైటిల్‌ ఎందుకు పెట్టామని తెలుస్తుంది'' అన్నారు.

సాయిధన్సిక మాట్లాడుతూ - ''కిరణ్‌గారు, సంతోష్‌గారు, సోని చరిష్టా, సూర్యతేజ్‌ ఇలా ఒక మంచి పవర్‌ఫుల్‌ టీం దొరికింది. నా కెరీర్‌లో ఇది చాలా ఇంపార్టెంట్‌ మూవీ. నా క్యారెక్టర్‌లో చాలా డైమన్షన్స్‌ ఉంటాయి. లవ్‌, కామెడీ, ఎమోషన్స్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. తప్పకుండా ఆడియెన్స్‌ను ఎంగేజ్‌ చేసే చిత్రమిది'' అన్నారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ - ''డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాను. స్క్రీన్‌ప్లే సినిమాకు ప్లస్‌ అవుతుంది. సినిమా ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది'' అన్నారు.

సోని చరిష్టా మాట్లాడుతూ - ''ఇందులో జ్వాలా దేవి అనే పవర్‌ఫుల్‌ పాత్రలో కనపడతాను. మంచి టీంతో పనిచేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా, అలీ, రాజా రవీంద్ర, భరత్‌ రెడ్డి, నాగినీడు, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: పెద్దిరాజు విహాస్‌, సంగీతం: సుక్కు, డ్యాన్స్‌: చంద్ర కిరణ్‌, కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటర్‌: చంద్రమౌళి, సహ నిర్మాత: పంతం అరుణ రెడ్డి, నిర్మాత: సంతోష్‌ కుమార్‌ కొంకా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్‌ శ్రీపురం.

More News

రెగ్యులర్ షూట్ లో జగపతిబాబు-నారా రోహిత్ ల 'ఆటగాళ్లు'

వెర్సటైల్ ఆర్టిస్ట్స్ జగపతిబాబు-నారా రోహిత్ టైటిల్ పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ఆటగాళ్లు' రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది.

'ఎంసీఏ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటే్శ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ నెల 15 న వస్తున్న లచ్చి

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకి దగ్గరైన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి.

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ సెన్సార్ పూర్తి

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్.

అప్పుడు ర‌చ‌యిత‌..ఇప్పుడు డైరెక్ట‌ర్‌...

వెంక‌టేష్ సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేని సినిమా 'నువ్వు నాకు న‌చ్చావ్'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కె.విజ‌య్‌భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు అందించాడు.