శర్వానంద్ తో మెహరీన్

  • IndiaGlitz, [Tuesday,December 06 2016]

ర‌న్ రాజా ర‌న్, ఎక్స్‌ప్రెస్‌రాజా, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రానిరోజు చిత్రాల‌తో స‌క్సెస్ మీదున్న శ‌ర్వానంద్ ఇప్పుడు దిల్‌రాజు నిర్మాణంలో స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో శ‌త‌మానం భ‌వతి చిత్రంలో న‌టించాడు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. శ‌ర్వానంద్ త‌దుప‌రి చిత్రాన్ని మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం శ‌ర్వానంద్ ఒకే చెప్పిన స్క్రిప్ట్‌కు మారుతి ఫైన‌ల్ వ‌ర్క్ చేస్తున్నాడ‌ట‌. సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా స్టార్ట్ అయ్యాయని టాక్‌. అందులో భాగంగా ఈ సినిమాలో శ‌ర్వానంద్‌కు జోడిగా మెహ‌రీన్ న‌టిస్తుంద‌ని ఫిలింన‌గ‌ర్ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.