టీచర్ గా మెహరీన్

  • IndiaGlitz, [Saturday,December 16 2017]

కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన పంజాబి ముద్దుగుమ్మ మెహ‌రీన్‌. ఆ త‌రువాత ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం గ్యాప్ వ‌చ్చినా.. ఈ ఏడాది చివ‌రి నాలుగు నెలల్లో త‌న చిత్రాల‌తో సంద‌డి చేసింది. సెప్టెంబ‌ర్‌లో మ‌హానుభావుడు, అక్టోబ‌ర్‌లో రాజా ది గ్రేట్ చిత్రాల‌తో విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. ఇక న‌వంబ‌ర్‌లో వ‌చ్చిన కేరాఫ్ సూర్య‌, డిసెంబ‌ర్‌లో వ‌చ్చిన జవాన్ చిత్రాలు ఆమెకి ఆశించిన విజ‌యాల‌నైతే ఇవ్వ‌లేక‌పోయాయి. ఇదిలా ఉంటే..

ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉంది. చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. మెహ‌రీన్ టీచ‌ర్ పాత్ర‌లో సంద‌డి చేయ‌బోతోంద‌ట‌. రెగ్యుల‌ర్ హీరోయిన్ల పాత్ర‌ల‌కు భిన్నంగా ఈ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని.. గోపీచంద్‌, మెహ‌రీన్ పాత్ర‌లు క‌లిసే సంద‌ర్భం.. వారి కాంబినేష‌న్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు అల‌రించేలా ఉంటాయ‌ని చిత్ర యూనిట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌చ్చే ఏడాది వేస‌వికి ఈ సినిమా తెర‌పైకి రానుంది.

More News

మ‌హేష్‌తోనూ హిట్ కొడ‌తాడా?

హే రామ్‌, క్రిష్ 3, 24 త‌దిత‌ర చిత్రాల‌తో ఛాయాగ్రాహ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ని చాటుకున్నారు సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ తిరున‌వుక‌ర‌సు. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన జ‌న‌తా గ్యారేజ్‌తో తొలిసారిగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌య‌మయ్యారు తిరు.

'బ్ర‌హ్మాండ‌నాయ‌గ‌న్‌'గా 'ఓం న‌మో వేంక‌టేశాయ'

అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసు, శిరిడి సాయి వంటి భ‌క్తిర‌స చిత్రాల త‌రువాత అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మ‌రో ఆధ్యాత్మిక చిత్రం'ఓం నమో వేంకటేశాయ'.

వారం గ్యాప్ లో నాగశౌర్య రెండు చిత్రాలు

యువ కథానాయకుడు నాగశౌర్య వచ్చే సంవత్సరం ఆరంభంలో రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

నాగ్ , నానిల మల్టీస్టారర్ పై క్లారిటీ వచ్చేసింది...

నాగార్జున,నాని కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందనుందనే సంగతి తెలిసిందే.

జనవరి 25న 'దండుపాళ్యం 3'

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.