మెహ‌రీన్‌.. ఈ ఏడాది కూడా అలాగే

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ (2016) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన‌ మెహరీన్.. గత ఏడాది (2017) ద్వితీయార్ధంలో వరుసగా నాలుగు నెల‌ల‌పాటు త‌న‌ సినిమాల‌తో సంద‌డి చేసి వార్త‌ల్లో నిలిచింది. శర్వానంద్‌కు జంటగా నటించిన ‘మహానుభావుడు’ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కాగా.. రవితేజతో కలిసి నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా అక్టోబర్‌లో రిలీజ్ అయింది. ఇక సందీప్ కిషన్ సరసన నటించిన బైలింగ్వల్ మూవీ ‘కేరాఫ్‌ సూర్య’ నవంబర్‌లో సందడి చేయగా.. మెగాహీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఆడిపాడిన ‘జవాన్’ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా గత ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా నాలుగు సినిమాలతో సందడి చేసింది మెహరీన్ . 

గత ఏడాది లాగే ఈ సంవత్సరం ప్రథ‌మార్థంలో కూడా మోహ‌రీన్ నుంచి ఒక్క సినిమా కూడా రావ‌డం లేదు. కాని ద్వితీయార్ధంలో మాత్రం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ 25వ చిత్రం ‘పంతం’లో మెహ‌రీన్ సోలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆ సినిమా జూలై 5న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్-2’ మూవీలో నాయికగా నటిస్తూనే.. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన బైలింగ్వల్ మూవీ ‘నోటా’లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానున్నాయి. ఇవే కాకుండా.. నితిన్‌కు జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఓ సినిమాలో కూడా మెహ‌రీన్‌ హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం.

More News

సాహో.. బ‌డ్జెట్ పెరుగుతోందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’.

మే 6న ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల పద్రానోత్సవం

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌)

ఒకే చిత్రానికి ఇద్దరు దర్శకులు!! 

మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ లో 'మల్లె పువ్వు', 'మెంటల్ కృష్ణ', నంది అవార్డు పొందిన 'కలవరమాయే మదిలో' వంటి మంచి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల కొన్నాళ్లుగా నిర్మాతల

రామ్ చ‌ర‌ణ్ సినిమాకి అవేమీ టైటిల్స్ కాద‌ట‌

రంగ‌స్థ‌లంతో చాలా కాలం త‌రువాత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.

'భరత్ అనే నేను'.. మే 4 నుంచి 'హోలీ' ఫైటింగ్ సీన్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’.