'మెహబూబా' సెన్సార్‌ పూర్తి - మే 11 విడుదల

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మిస్తున్న చిత్రం 'మెహబూబా'. మే 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు... శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ '' మా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెన్సార్‌ సభ్యులందరికీ సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఆకాష్‌ చాలా బాగున్నాడు, లవ్‌ స్టోరీ చాలా బాగుంది అని పదే పదే చెప్పడంతో మాకు చాలా ఎనర్జీ వచ్చింది. సినిమాపై మరింత కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఈ సందర్భంగా సెన్సార్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మే 11న ప్రపంచవ్యాప్తంగా మా 'మెహబూబా' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.

పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

More News

పాట చిత్రీక‌ర‌ణ‌లో..'తేజ్ ఐ లవ్ యు'

ప్రేమ‌క‌థా చిత్రాల‌ స్పెషలిస్ట్ ద‌ర్శ‌కుడు ఎ.కరుణాకరన్.. ప్రేమకథలను తనదైన శైలిలో వెండి తెరపై చూపడంలో నేర్పరి.

శ‌ర్వా కోసం భారీ సెట్‌

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది.

'2.0' మ‌రింత ఆల‌స్యం

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

రాజ్ త‌రుణ్‌కు ప్ల‌స్ అవుతారా?

యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ సినిమాలో తల్లి పాత్రలు చాలా ప్రభావం చూపిస్తాయి.

'జంబల‌కిడిపంబ‌' లో అదిరిపోయే కాన్సెప్ట్ - హీరో నాని

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి