మెగాస్టార్ ‘లూసిఫర్’ అప్‌డేట్ వచ్చేసింది

  • IndiaGlitz, [Wednesday,December 16 2020]

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా అప్‌డేట్ కోసం చిరు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రీమేక్ కోసం ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్‌గా సినిమాకు దర్శకుడు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు బుధవారం తన సినిమా దర్శకుడిని మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

లూసిఫర్‌ను తెలుగులో మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. ఈ రీమేక్‌ను కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్‌వీఆర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ షూటింగ్‌లో ఉన్నందున సంకాంత్రి తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. లూసిఫ‌ర్ సినిమా రీమేక్ స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యిందని.. ‘త‌నిఒరువ‌న్’ ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శక‌త్వం వ‌హిస్తారన్నారు. రీమేక్ క‌థ ఓకే అయ్యింది. మన నేటివిటీకి త‌గ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశారని వెల్లడించారు.

ద‌ర్శకుడు మోహ‌న్ రాజా కూడా ట్విట్టర్ వేదికగా లూసిఫర్ రీమేక్‌పై స్పందించారు. ‘‘నా తల్లిదండ్రులు, వెల్ విషర్స్ నాకందించిన ఆశీర్వాదాల కారణంగా జీవితం నాకు అద్భుతమైన అవకాశాలను బహుమతిగా ఇచ్చింది. అలాగే ప్రస్తుతం నాకు మెగాస్టార్ తనంతట తానే తన మెగా ప్రాజెక్టుకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించడం చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి విషెస్, ప్రేయర్స్ ఇవ్వండి’’ అంటూ మోహన్ రాజా ట్వీట్ చేశారు.