37 ఏళ్ల త‌ర్వాత ఆ బ్యాన‌ర్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించాల‌ని నిర్మాతలు భావిస్తుంటారు. ఆయ‌న చేసిన 150 చిత్రాల్లో చాలా మందినిర్మాత‌ల‌తో ప‌నిచేసి ఉంటారు. అలాంటి నిర్మాత‌ల్లో ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత డి.రామానాయుడు ఒక‌రు. ఈయ‌న చిరంజీవితో అప్ప‌ట్లో సంఘ‌ర్ష‌ణ అనే సినిమాను నిర్మించారు. 1983లో ఈ చిత్రం విడుద‌లైంది. ఆ త‌ర్వాత రామానాయుడు బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో చిరంజీవి సినిమా చేయ‌నేలేదు. అయితే దాదాపు 37 ఏళ్ల త‌ర్వాత చిరంజీవి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

వివ‌రాల్లోకెళ్లే ప్ర‌స్తుతం త‌న 152వ చిత్రం ఆచార్య‌ను ఎప్పుడెప్పుడు పూర్తి చేయాలా అని చిరంజీవి ఎదురుచూస్తున్నాడు. మ‌రో వైపు సుజిత్ లూసిఫ‌ర్ రీమేక్ స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉన్నాడు. దీని త‌ర్వాత చిరంజీవి లిస్టులో ఉన్న ద‌ర్శ‌కుల్లో బాబీ ఒక‌డు. వెంకీమామతో గ‌త ఏడాది హిట్ అందుకున్న బాబీ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఆయ‌న ప్ర‌తి సినిమా నిర్మాణంలో రామ్‌చ‌ర‌ణ్ భాగ‌స్వామి అవుతున్నారు. అలాగే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో చ‌ర‌ణ్ కూడా పార్ట్ అవుతాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగ‌క త‌ప్పేలా లేదు.