CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి, ఏం మాట్లాడుకున్నారంటే..?

  • IndiaGlitz, [Tuesday,December 26 2023]

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీనటుడు , మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఇటీవల సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం రేవంత్‌ రెడ్డిని చిరు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు చిరంజీవి అభినందనలు తెలియజేశారు. కాగా.. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను కలిసిన తొలి ప్రముఖుడు చిరంజీవే. సినీ పరిశ్రమ నుంచి కాంగ్రెస్ పార్టీ అభినందనలు వెల్లువెత్తినప్పటికీ.. ఏ ప్రముఖుడూ వ్యక్తిగతంగా ప్రభుత్వ పెద్దలను భేటీ కాలేదు. తాజా భేటీలో రేవంత్ రెడ్డి, చిరంజీవి పలు అంశాలపై చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ ప్రభుత్వం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తుందని, చిత్ర పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇకపోతే.. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎష్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు మంచి ప్రోత్సాహం అందించిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్‌లు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో సన్నిహితంగా వుండేవారు. బెనిఫిట్ షో, స్పెషల్ షోలు, టికెట్ల పెంపు వంటి అంశాలతో పాటు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేవారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా సినీ పరిశ్రమ అదే రకమైన సాయాన్ని ఆశిస్తోంది. త్వరలోనే మరింత మంది నిర్మాతలు, సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం వుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగించారు రేవంత్. మరి ఆయన ఎలాంటి పనితీరు కనబరుస్తారో చూడాలి.

More News

Harirama Jogaiah:జనసేనలో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖల ప్రకంపనలు..

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు వేగంగా రాజుకుంటోంది. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అంచనా వేయడం కష్టమౌతోంది.

YCP:వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు..?

ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆ పార్టీ అధినేత జగన్

ఇలా అయితే కష్టమే.. పవన్ కల్యాణ్‌ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం..

టీడీపీ పొత్తు పెట్టుకోవడం జనసేన క్యాడర్‌కు నచ్చలేదా..? తమ అధినేత పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న కార్యకర్తల ఆశలు అడియాశలేనా..?

YS Sharmila:లోకేష్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్.. జోరుగా చర్చలు మొదలు..

టీడీపీ యువనేత నారా లోకేష్‌(Nara Lokesh) ఊహించని క్రిస్మస్ గిఫ్ట్(Christmas gift) అందుకున్నారు.

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి ఐదుగురు మృతి..

నల్గగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.