ఆ ఇద్ద‌రి భామ‌ల‌ను ఫైన‌ల్ చేసిన మెగా హీరో

  • IndiaGlitz, [Wednesday,February 24 2016]

మెగా హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం సుప్రీమ్ సినిమాలో న‌టిస్తున్నారు. ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న సుప్రీమ్ ఏప్రిల్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...సాయిథ‌ర‌మ్ తేజ్ - మ‌లినేని గోపీచంద్ తో సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ కి అవ‌కాశం ఉంద‌ట‌.

అయితే ఆ ఇద్ద‌రి హీరోయిన్స్ ఎవ‌రైతే బాగుంటారా అని ఆలోచించి ఫైన‌ల్ గా రెజీనా - లావ‌ణ్య త్రిపాఠి ని ఫైన‌ల్ చేసార‌ట‌. రెజీనా తేజు తో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ప‌ర్ సేల్ చిత్రాల్లో న‌టించింది. లావ‌ణ్య త్రిపాఠి ఇప్ప‌టి వ‌ర‌కు తేజు తో న‌టించ‌లేదు. తేజు ఈ ఇద్ద‌రి భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌డానికి రెడీ అవుతున్న ఈ సినిమాని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు.

More News

దేవాలయాలు ప్రారంభించిన అగ్ర హీరోలు..

హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే.ఈ ప్రాముఖ్యతను మరింత పెంచేలా ఈ దైవ సన్నిధానంలో మరిన్ని దేవాలయాలను ఏర్పాటు చేసారు.

ఆ వార్తల్లో వాస్త‌వం లేదంటున్న చిరు

కేంద్ర మాజీ మంత్రి, రాజ్య‌స‌భ్యుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి బి.జె.పి లో చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లోఅయితే   చిరు బి.జె.పి కి ద‌గ్గ‌ర‌వుతున్నాడ‌ని...ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సి.ఎం అభ్య‌ర్ధిగా చిరంజీవిని  బి.జె.పి ప్ర‌క‌టించ‌నుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

బ్రహ్మోత్సవం లో మహేష్ కుమార్తె..

సూపర్ స్టార్ మహేష్ -శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందుతున్న బ్రహ్మోత్సవం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

తమిళ టీ.విలో వ్యాఖ్యాతగా తెలుగు హీరో...

తమిళ టీ.వి లోవ్యాఖ్యాత గా తెలుగు హీరోనా..?ఎవరా హీరో అనుకుంటున్నారా..?దగ్గుబాటి రానా.

హ్యాపీ బర్త్ డే టు నేచురల్ స్టార్ నాని..

అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు నాని.