మా 'మీరా' చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర యూనిట్

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

ఆదిత్య, నికిత, ఇషికలు హీరో హీరోయిన్లుగా ఉనికొ సినీ స్వ్వాడ్‌ పతాకంపై సంతోష్‌ యూబులుస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ గాజుల్లా కుమార్‌, గాజుల్లా రమేష్‌లు నిర్మించిన చిత్రం 'మీరా'. ఈ చిత్రం ఇటీవల మార్చి 25న విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..మా చిన్న చిత్రాన్ని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నందుకు మేము ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా దర్శకుడు సంతోష్‌ యాబులుస్‌ ఈ చిత్ర కథ, కథనాలను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. 'హృదయకాలేయం' ఫేమ్‌ ఇషిక ఈ చిత్రంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించింది. ఇషిక పాత్రను మా దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ లోకం లో ఎవరూ చేయని ఒక నీచమైన పనిని ఆమె చేసింది అనే ఆసక్తిరమైన అంశంతో 'మీరా' తెరకెక్కింది. హీరో ఆదిత్య పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. కొత్తవాడైనా కూడా తన పాత్రకు ఆదిత్య పూర్తి న్యాయం చేశాడు. ఇలాంటి మంచి నటులను తెలుగు సినిమా దర్శకనిర్మాతలు ఎప్పుడూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం..అని అన్నారు.

దర్శకుడు సంతోష్‌ యాబులుస్‌ మాట్లాడుతూ...ముందుగా ఈ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ సాధించిన విజయం దర్శకుడిగా నా స్థాయిని పెంచింది. అద్భుతమైన స్క్రీన్‌ప్లే..అని అందరూ అంటుంటే.దర్శకుడిగా ఒకడుగు ముందుకు వేశాననే భావన నాకు కలుగుతుంది. మంచి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అది మరోసారి ఈ చిత్రంతో నిరూపించారు..అని అన్నారు.

ఆదిత్య, నికిత, ఇషిక, శ్రీధర్‌, సూర్యకుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చరణ్‌, ఎడిటింగ్‌: డి.ఎ. రాకేశ్‌ గౌడ్‌, నిర్మాతలు : గాజుల్ల కుమార్‌, గాజుల్ల రమేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-సంగీతం- దర్శకత్వం: సంతోష్‌ యాబులుస్‌.

More News

త‌మ‌న్నా విష‌యంలో మ‌రోసారి

త‌ను న‌టించే సినిమాల విష‌యంలో త‌మ‌న్నాకి ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఆమెకి చాలా సార్లు విజ‌యాల‌ను అందించింది. నిన్న విడుద‌లై స‌ర్వ‌త్రా మంచి టాక్ తెచ్చుకున్న 'ఊపిరి' విష‌యంలోనూ అది మ‌రోసారి రుజువైంది. ఇంత‌కీ అదేమిటంటే.. స‌మ్మ‌ర్ టైంలో రిలీజ‌య్యే త‌మ‌న్నా సినిమాలు హిట్ అవుతాయ‌న్న‌ది.

పి.వి.పి కి హ్యాట్రిక్ ద‌క్కేనా..

ఇప్పుడు టాలీవుడ్ లో బాగా పాపుల‌ర్ అయిన పేరు పి.వి.పి. ర‌వితేజ హీరోగా బ‌లుపు చిత్రాన్ని నిర్మించి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించారు పి.వి.పి. బ‌లుపు త‌ర్వాత త‌మిళ్ లో విశ్వ‌రూపం, తెలుగులో వ‌ర్ణ‌, సైజ్ జీరో చిత్రాల‌ను నిర్మించినా..స‌క్సెస్ మాత్రం సాధించ‌లేక‌పోయారు.

ప‌వన్ ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్న సెంటిమెంట్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. బాబీ తెర‌కెక్కిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లో రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

ఊపిరి పై కొనసాగుతున్న స్టార్స్ ప్రశంసల వర్షం

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ-మిల్కీబ్యూటీ తమన్నా క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.

ఆ వార్త‌లు జ‌స్ట్ రూమ‌ర్స్ అంటున్న వెంకీ..

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బాబు బంగారం. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.