మారుతి, చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొస్తాడా?

  • IndiaGlitz, [Tuesday,May 22 2018]

ఫీల్ గుడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు గోపీసుందర్. 2015లో వచ్చిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి చిత్రంతో ఆ విష‌యాన్ని నిరూపించుకున్నారు. అదే సంవత్సరం మారుతి దర్శకత్వంలో రూపొందిన 'భలే భలే మగాడివోయ్'కి సంగీతం అందించి.. కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అలాగే.. 2016లో నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' చిత్రానికి కూడా స్వరాలు అందించారు. చైతు కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్‌గా నిలిచిపోయింది ఈ చిత్రం.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మారుతి, చైతు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకి స్వరాలను సమకూరుస్తున్నారు గోపీసుందర్. ఆ వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు'.

ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మరి గతంలో వేరువేరుగా మారుతికి, చైతుకి హిట్స్‌ని అందించిన గోపీసుందర్.. ఇప్పుడు వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమాతోనూ హిట్‌ని అందిస్తారేమో చూడాలి.

More News

18 ఏళ్ళ త‌రువాత..

అక్కినేని నాగార్జున నటించిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా..

రెండు నెల‌ల పాటు యు.ఎస్‌లో ర‌వితేజ బిజీ

ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా విడుదలయ్యేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు రవితేజ.

దిల్ రాజు, భూమా అఖిలప్రియ చేతుల మీదుగా 'బంగారి బాలరాజు' పాటలు విడుదల

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే.

డ్రైవర్ రాముడు టీజర్ ను విడుదల చేసిన సుధీర్ బాబు

నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరో గా  రాజ్ స‌త్య దర్శకత్వంలో

ఒకే నెలలో మూడు సినిమాల‌తో.. 

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాస్ చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై.