'మను' ట్రైలర్‌ విడుదల

  • IndiaGlitz, [Sunday,August 12 2018]

రాజా గౌతమ్‌, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'మను' ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. నిర్వాణ సినిమాస్‌ సమర్పణలో క్రౌడ్‌ ఫండెడ్‌గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫ˜ణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు.

రాజా గౌతమ్‌ మాట్లాడుతూ - ''ఇది మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీ స్టార్ట్‌ కాకముందు చాలా షార్ట్‌ ఫిలింస్‌ చూశాను. షార్ట్‌ ఫిలింస్‌ డైరెక్టర్స్‌ని కలిశాను. 40-50 కథలు విన్నాను. ఈ ప్రాసెస్‌లో మధురం అనే షార్ట్‌ ఫిలిమ్‌ చూసాను, చాలా బాగా నచ్చింది. డైరెక్టర్‌ ఫణిని అప్రిషియేట్‌ చేశాను కూడా. ఆ సందర్భంలో మను సినిమా గురించి.. ఓ పదిహేను నిమిషాలు కథ చెప్పాడు.

స్క్రిప్ట్‌ అద్భుతంగా ఉందని చెప్పాను. ఓరోజు తను మను క్యారెక్టర్‌ నువ్వే చేస్తున్నావ్‌ అంటూ మెసేజ్‌ చేశాడు. చాలా సంతోషంగా అనిపించింది. 115 మంది డబ్బులు పెట్టి చేసిన సినిమా కాబట్టి.. ఎంత బాధ్యతగా ఉండాలో తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. హీరోయిన్‌ చాందిని మాతో కలిసిపోయి పనిచేసింది. చాలా ఓపికగా సినిమా కోసం పనిచేసింది. తన కమిట్‌మెంట్‌, డేడికేషన్‌ సూపర్బ్‌. నీల పాత్రలో అద్భుతంగా నటించింది. సెప్టెంబర్‌ 7న సినిమా విడుదలవుతుంది'' అన్నారు.

చాందిని చౌదరి మాట్లాడుతూ - ''ఈ క్షణం కోసం నేను ఎంతో వెయిట్‌ చేశాను. ట్రైలర్‌ అందరికీ నచ్చే ఉంటుంది. దీని కంటే ఎన్నో రెట్లు సినిమా గొప్పగా ఉంటుంది. ఫణి, తను చెప్పేదాని కంటే గొప్ప విజన్‌ ఉన్న డైరెక్టర్‌. నాపై నమ్మకంతో ఫణి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో నీలు అనే డెప్త్‌ ఉండే క్యారెక్టర్‌ చేశాను.'' అన్నారు.

డైరెక్టర్‌ ఫణీంద్ర నార్‌శెట్టి మాట్లాడుతూ - ''ఇది నాకు ఎమోషనల్‌ మూమెంట్‌. కాబట్టి ఇన్వెస్టర్స్‌ను మరచిపోలేను. ఇంత పెద్ద ప్రయాణం ఎక్కడ మొదలైందని చెప్పలేను. ఈ సినిమా కోసం వెయ్యి రూపాయల నుండి నలబై లక్షల వరకు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. సినిమాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. సినిమా మా వర్క్‌ గురించి ఎక్కువగా చెబుతుందని నమ్ముతున్నాం. ఇంత కంటే బెస్ట్‌ టీమ్‌తో పనిచేయలేనేమోననిపిస్తుంది. ఏడాదిన్నర క్రితమే నిర్వాణ సినిమాస్‌ మమ్మల్ని సంప్రదించారు. వాళ్ల నమ్మకాన్ని సినిమా నిజం చేస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.

నిర్వాణ సినిమాస్‌ రాజ్‌ నిహార్‌ మాట్లాడుతూ - ''ఒక సినిమా అందరికీ రీచ్‌ కావాలంటే మంచి కథ కావాలి. అలాంటి కథతో ఫణి చేసిన చిత్రమిది. మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్స్‌గా మాపై ఉందనిపించింది. అందుకే మేము ఈ సినిమాలో భాగమైయాం'' అన్నారు.

రాజా గౌతమ్‌, చాందిని చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌ రెడ్డి, ఆర్ట్‌: శివ్‌కుమార్‌, సౌండ్‌ డిజైన్‌: సచిన్‌ సుధాకరన్‌, హరిహరన్‌, నిర్మాణం: క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీ(115 మెంబర్స్‌), రచన, దర్శకత్వం: ఫణీంద్ర నార్‌శెట్టి.

More News

సెప్టెంబర్ లో విడుదల కానున్న 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు'

"యుక్త వ‌య‌సులోకి అడుగుపెట్టిన ప్ర‌తి ఒక్క‌రూ  అమ్మాయి క‌నిపిస్తే, ఇక ఆమే జీవితం అనుకుని వెంట‌ప‌డి పెళ్లి చేసుకుంటేనే  ప్రేమ ఉన్న‌ట్టు కాదు. ఆమె కాద‌న్నంత మాత్రాన జీవితాల‌నూ త్యాగం

చిరు పాత్ర‌లో వ‌రుణ్ తేజ్‌.. అయితే కండీష‌న్ అప్లై...

ఎన్టీఆర్ బయోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ క్రిష్ వీలైనన్ని హంగుల‌ను అద్దుతున్నారు.

కారు యాక్సిడెంట్‌లో విక్ర‌మ్ త‌న‌యుడు

హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ ఇప్పుడు హీరోగా 'వ‌ర్మ' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఆగ‌స్ట్ 24న విడుద‌ల‌వుతున్న 'ది స్టోలెన్ ప్రిన్సెస్‌'

ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రిచే విన్యాసాలు.. థ్రిల్ చేసే యాక్ష‌న్స్, ఆశ్చర్యానికి గురిచేసే మాయ‌లు.. మంత్రాలు ఇవ‌న్నీ సోషియో ఫాంట‌సీ చిత్రాల్లో కామ‌న్‌గా ఉండే అంశాలే.

'ఆర్ ఎక్స్ 100' త‌మిళ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం 'ఆర్‌.ఎక్స్100'. చిన్న చిత్రంగా విడుద‌లై పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా