‘నార‌ప్ప‌’ నుంచి మ‌ణిశ‌ర్మ వాకౌట్ ?

విక్టరీ వెంకటేశ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నారప్ప‌’. సురేష్ ప్రొడక్ష‌న్స్ , వి క్రియేషన్స్ పతాకాలపై కలైపులి థాను, డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. కోవిడ్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ, స్టార్ట్ అయిన ‘నారప్ప‌’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నుల‌ను పూర్తి చేసుకోవ‌డంలో బిజి బిజీగా ఉంది. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. అయితే రిలీజ్ డేట్‌పై యూనిట్ పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ షాకిచ్చాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ మ‌ణిశ‌ర్మ ఏం చేశాడో తెలుసా?.. ఇది వ‌ర‌కే టీజ‌ర్ విష‌యంలో త‌న బ్యాగ్రౌండ్‌ను వాడుకోకుండా జీవీ ప్ర‌కాశ్ సంగీతం అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను వాడుకున్నారు. వాడుకుంటే వాడుకున్నారు కానీ.. మ‌ణిశ‌ర్మ పేరు వేయ‌డంతో మ‌ణిశ‌ర్మ‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై అసంతృప్తిగా ఉన్న మ‌ణిశ‌ర్మ‌..ఈ డిస్ శాటిస్పాక్ష‌న్‌తోనే నార‌ప్ప టీమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

‘బాహుబలి’ చెత్తగా ఉందని.. డస్ట్‌బిన్‌లో పడేయమన్న నెట్‌ఫ్లిక్స్.. నెటిజన్ల ఫైర్

సినీ ఇండస్ట్రీ అంటే ‘బాహుబలి’కి తర్వాత.. ముందు అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. నిజానికి ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇదొక సెన్సేషన్.

ఎన్టీఆర్‌తో ఐశ్వ‌ర్యా రాజేష్‌..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో కోలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌టిగా పేరు సంపాదించుకుని ఇప్పుడిప్పుడే తెలుగులో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోన్న తెలుగు అమ్మాయి ఐశ్వ‌ర్యా రాజేశ్ జోడీ క‌డుతుందా?

మళ్లీ జగన్ మార్క్.. ఆసక్తికరంగా మేయర్, డిప్యూటీ పదవులు

ఏపీలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆసక్తికరంగా మారాయి. ‘నొప్పించక.. తానొవ్వక’ అన్నట్టుగా వైసీపీ అధినేత వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు కనిపిస్తుంది. ఆశావహులు ఎక్కువగా ఉన్నచోట

అనుదీప్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు?

ఒకరు ‘జాతిరత్నాలు’తో పేరు తెచ్చుకుంటే.. ఒకరు ‘ఉప్పెన’తో పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని టాక్. ‘పిట్టగోడ’ సినిమాతో వచ్చి..

స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం!

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లలో కరోనా విజృంభిస్తోంది. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు సైతం కరోనా బారిన పడుతున్నారు.