అల్లు శిరీష్ కి కూడా కలిసొస్తాడా?

  • IndiaGlitz, [Monday,December 11 2017]

మెగా ఫ్యామిలీకి క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుడు అంటే మొద‌ట‌గా వినిపించే పేరు మెలోడీ బ్ర‌హ్మ‌ మ‌ణిశ‌ర్మ‌. ఆ కుటుంబంలో తొలిసారిగా ఏ క‌థానాయ‌కుడికి మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించినా.. ఆ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు హిట్టే అయ్యింది. మెగాస్టార్ చిరంజీవితో బావ‌గారూ బాగున్నారాతో మొద‌లైన ఈ ప్ర‌స్థానం.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఖుషి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో చిరుత‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో ప‌రుగు.. ఇలా స‌క్సెస్‌ఫుల్‌గానే సాగింది.

ఇప్పుడు ఈ వ‌రుస‌లో మ‌రో క‌థానాయ‌కుడు చేరుతున్నాడు. అత‌నే అల్లు శిరీష్‌. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి కూడా మ‌ణిశ‌ర్మ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. అల్లు శిరీష్‌, మ‌ణిశ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ తొలి చిత్రం.. డిసెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

చిరు, ప‌వ‌న్‌, చ‌ర‌ణ్‌, బ‌న్ని.. ఇలా మెగా ఫ్యామిలీ హీరోలతో మొద‌టిసారిగా ప‌నిచేసిన చిత్రాల‌న్నింటికి క‌లిసి రావ‌డమే కాకుండా.. మ్యూజిక‌ల్‌గా ఆ చిత్రాల‌ను ఓ రేంజ్‌లో నిలిపిన మ‌ణి.. ఆ మ్యాజిక్‌ని శిరీష్ విష‌యంలోనూ కొన‌సాగిస్తాడా? వేచిచూడాల్సిందే.

More News

వస్తున్నాం..బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం..ఇది ఫిక్స్ !! - కింగ్ నాగార్జున

అఖిల్ హీరోగా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను `హలో`అంటూ డిసెంబర్ 22న పలకరించబోతున్నారు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని. ఈయన కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక

రాజ‌మౌళి.. కుటుంబ‌క‌థా చిత్రం?

స్టూడెంట్ నెం.1 నుంచి బాహుబ‌లి 2 వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. బాహుబ‌లి సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్న రాజ‌మౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీగా చేయ‌బోతున్నార‌ని చాలా రోజులుగా వారĺ

డ్యాన్స్ టీచ‌ర్‌గా రాశి ఖ‌న్నా

జై ల‌వ కుశ‌, ఆక్సిజ‌న్ చిత్రాల‌తో ఈ ఏడాది సంద‌డి చేసిన రాశి ఖ‌న్నా.. ప్ర‌స్తుతం ట‌చ్ చేసి చూడు, తొలి ప్రేమ చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

'జై సింహా' సెన్సార్ డేట్ ఫిక్స‌య్యిందా?

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం జై సింహా. సింహా, శ్రీ‌రామరాజ్యం చిత్రాల్లో బాల‌య్య‌కి జోడీగా న‌టించిన న‌య‌న‌తార ఈ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్

సుప్రసిద్ధ నటీమణి గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా అందలాన్నందుకొన్న గౌతమి ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను సైతం జయించి, తనలా మరెవరూ బాధపడకూడదనే దృఢ నిశ్చయంతో "లైఫ్ ఎగైన్" ఫౌండేషన్ ను ప్రారంభించారు.