'మ‌ణిశంక‌ర్' ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌

  • IndiaGlitz, [Monday,November 01 2021]

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ (జి.వి. కె). లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా 'మ‌ణిశంక‌ర్' టైటిల్ అండ్ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ముందు క‌త్తుల‌తో ఇంటెన్స్‌లుక్‌లో శివ కంఠ‌మ‌నేని ఉన్న ఈ క్రియేటివ్‌ ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా..

హీరో శివ‌కంఠ‌మ‌నేని మాట్లాడుతూ - ''ఈ రోజు విడుద‌లైన మా 'మ‌ణిశంక‌ర్' టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దేల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు జీవీకే మేకింగ్ చాలా కొత్త‌గా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చే చిత్రం అవుతుంది''అన్నారు.

ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ - ''మ‌ణిశంక‌ర్ అనేది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది'' అన్నారు.

తారాగ‌ణం: శివ కంఠ‌మ‌నేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణిక్య‌, మాణిక్య రెడ్డి, సుబ్బ‌రాజ్ శ‌ర్మ‌, అరోహి నాయుడు, నెల్లూరు సుబ్బు

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: ధూంధాంగా దీపావళీ ఎపిసోడ్.. చివరిలో లోబో ఎలిమినేషన్.. !!

బిగ్‌బాస్ 5 తెలుగు దీపావళీ వేడుక ధూమ్ ధామ్‌గా జరిగింది. ప్రత్యేక కార్యక్రమాలతో, స్పెషల్ గెస్ట్‌లతో హౌస్ సందదిగా మారింది.

పునీత్ మరణం: పెళ్లిమండపంలోనే అప్పుకు నివాళి అర్పించిన కొత్తజంట

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

విశాల హృదయం: ఆ 1800 మంది పిల్లల బాధ్యత నాదే.. పునీత్‌కి విశాల్ ఘన నివాళి

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ భారతీయ సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచింది.

అంచనాలు పెంచేసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ గ్లింప్స్... ఫ్యాన్స్‌కి పూనకాలే..!!

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళీ తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జనవరి 7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

టీడీపీ పగ్గాలు చంద్రబాబుకు ఎందుకిచ్చావ్ - బాలయ్యకు మోహన్ బాబు సూటి ప్రశ్న

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఎంట్రీ  ఇచ్చిన సంగతి తెలిసిందే.