రెండో హీరోయిన్ కోసం వేటాడుతున్నారు

  • IndiaGlitz, [Monday,August 10 2015]

ఓకే బంగారం' తర్వాత ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం తన దర్శకత్వంలో మరో సినిమాని రూపొందించే పనిలో బిజీ అయిపోయారు. ఈ సినిమాలో కార్తీ మెయిన్ లీడ్ చేస్తున్నాడు. కాగా ఓకే బంగారం' ఫేమ్ దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ లు కూడా ఈ సినిమాలో పార్ట్ అవుతున్నారు.

మరో హీరోయిన్ కోసం మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే గతంలో ఈ చిత్రంలో నయనతార, శృతిహాసన్ లు హీరోయిన్స్ గా నటిస్తారనే టాక్ వినపడింది. మరి వీరు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో మరి. అలాగే ఈ చిత్రానికి కోమాలి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.