మ‌ణిర‌త్నం మ‌ల్టీస్టార‌ర్ మూవీ అప్‌డేట్‌

  • IndiaGlitz, [Monday,May 07 2018]

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'నవాబ్' (తమిళంలో 'చెక్క చివంత వానం') పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితిరావ్ హైదరి, ఐశ్వర్యా రాజేష్, ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నలుగురు వ్యక్తుల జీవితాలను విశ్లేషించే కథగా ఈ చిత్రం ఉంటుందనీ.. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ ముఖ్యమైన సామాజిక - రాజకీయ సమస్యను పరిష్కరించే దిశగా సాగే అంశాలను కూడా ఈ సినిమాలో ట‌చ్ చేయ‌బోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా.. అరవింద్ స్వామి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రీక‌ర‌ణ‌తో తన షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న అరవింద్ స్వామి.. డైరెక్టర్ మణిరత్నం, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని  పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ ఏడాది  చివ‌ర‌లో తెరపైకి రానుంది.

More News

రెండు వారాల గ్యాప్‌లో రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా', 'కుమారి 21ఎఫ్', 'సినిమా చూపిస్త మావ' లాంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.

నేటి ట్రెండ్ కి తగ్గ పర్ ఫెక్ట్ సినిమా తారామణి - డైరెక్టర్ మారుతి

తమిళంలో తారామణి పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

భారత సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాను - ఆర్మీ అధికారుల స్పెషల్ షోలో అల్లు అర్జున్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

'బాహుబలి 2 - ది కంక్లూజ‌న్‌' ఆ ఫీట్ సాధిస్తుందా?

జాతీయ స్థాయిలో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన చిత్రం ‘బాహుబలి 2 - ది కంక్లూజ‌న్‌’. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1600 కోట్ల‌కి పైగా గ్రాస్ రాబ‌ట్టిన ఈ సినిమా..

అఖిల్ సినిమాకి కూడా అలాగే చేస్తున్న ద‌ర్శ‌కుడు

‘తొలిప్రేమ’ సినిమాతో టాలీవుడ్‌లోకి దర్శకుడిగా అడుగుపెట్టి ఘ‌న‌విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు వెంకీ అట్లూరి.