నా కోసం ఖ‌ర్చు పెట్ట‌కండి - మోహ‌న్ బాబు

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

ఎందరో అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ అండగా నిలబడుతున్న స్వచ్చంద సంస్థ మిరాకిల్ ఫౌండేషన్ సంస్థకు ప్రజలు తమ వంతుగా సపోర్ట చేయాలని డా.మంచు మోహన్ బాబు కోరారు. ఈ సంస్థ గురించి ఆయన మాట్లాడుతూ 'ఈ మార్చి 19న నేను మరో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటాను. 1993 నుండి ప్రతి పుట్టినరోజును విద్యానికేతన్ లో పిల్లల మధ్య జరుపుకోవడం అలవాటు, ఈ విషయం అందరికీ తెలిసిందే. అభం శుభం తెలియని పసి హృదయాలు అందించే ఆశీస్సులు నాకు ఎప్పుడూ గొప్ప అనుభూతినిస్తాయి. అయితే ప్రతి పుట్టినరోజున శుభాకాంక్షలతో పాటు వందల సంఖ్యల పుష్పగుచ్చాలు, పూల దండలు అందుకుంటాను. అవి మరుసటి రోజును వాడిపోతాయి. వాటిని పారవేస్తాం. అయితే ఈసారి నా పుట్టినరోజున నాకు ఎవరూ పూలదండలు, పుష్పగుచ్చాలు తీసుకురాకండి. ఆ డబ్బును ఏదైనా సమాజానికి సేవ చేస్తున్న స్వచ్చంద సంస్థలకు అందజేయమని కోరుతున్నాను.

ఇటీవల మిరాకిల్ ఫౌండేషన్ ను సందర్శించి వారు సమాజానికి అందిస్తున్న తోడ్పాటు చూసి ఇంప్రెస్ అయ్యాను. 3000 మంది ఆనాథ పిల్లలకు తమ వంతుగా సహాయ సహాకారాలను అందిస్తున్నారు. మిరాకిల్ వ్యవస్థాపకుడు కారోలైన్ బౌడ్రియాక్స్ వంటి నిస్వార్ధపరులు ఈ సమాజానికి ఎంతో అవసరం. కాబట్టి ఇలాంటి సంస్థలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

నా పుట్టినరోజు కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని సదరు మిరాకిల్ ఫౌండేషన్ సంస్థకు పంపండి. మీరు అందించే ఈ సహాయం ఎంతో మంది చిన్నపిల్లల జీవితాలను మార్చి వేస్తాయి. ఈ సహాయ సహకారాలను అందిస్తారని కోరుకుంటున్నాను'' అన్నారు.

More News

సరికొత్త దృశ్యకావ్యం18న విడుదల....

కార్తీక్-కాశ్మీరా జంటగా పుష్యమి ఫిలింస్ బ్యానర్ పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిన చిత్రం దృశ్యకావ్యం.

ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతున్న నారారోహిత్ 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు.

ఖుషీ సీక్వెల్ గురించి రేణు రియాక్షన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఎస్.జె.సూర్య కాంబినేషన్లో తాజాగా ఖుషీ సీక్వెల్ రూపొందించనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యిందా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం ప్ర‌స్తుతం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యింది అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

యార్ల‌గ‌డ్డ సుమంత్ సినిమా పూర్త‌య్యింది..

ప్రేమ‌క‌థ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే మంచి న‌టుడు అనిపించుకున్నాడు  అక్కినేని మ‌న‌వ‌డు..నాగార్జున మేన‌ల్లుడు యార్ల‌గ‌డ్డ సుమంత్. ఆత‌ర్వాత స‌త్యం, గౌరి, మ‌ధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి స‌క్సెస్ సాధించాడు.