మ‌నోజ్ కూడా స్టార్ట్ చేసాడు..

  • IndiaGlitz, [Friday,September 11 2015]

మంచు విష్ణు కొత్త సినిమా ప్రారంభించాడు. మ‌రి..మ‌నోజ్ ఏంటి సైలెంట్ గా ఉన్నాడు. ఇంకా సినిమా స్టార్ట్ చేయలేద‌నుకున్నారు. కానీ మ‌నోజ్ సైలెంట్ గా స్టార్ట్ చేసాడు. ఫ్యామిలీ చిత్రాల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌నోజ్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాని సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ ఇండియా ప్రై లిమిటెడ్ ప‌తాకం పై ఎం.శివ‌కుమార్ నిర్మిస్తున్నారు.

బంధాలు, అనుబంధాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించే ద‌శ‌ర‌థ్ ఈసారి స‌రికొత్త క‌ధాంశంతో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ప్లాన్ చేసాడ‌ట‌. హైద‌రాబాద్ లో ఫ‌స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసారు. మ‌నోజ్ స‌ర‌స‌న రెజీనా హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి గోపీ మోహ‌న్ స్ర్కీన్ ప్లే అందించారు. ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కొత్త సినిమా ప్రారంభ‌మైందంటూ మ‌నోజ్ త‌న సంతోషాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. మ‌రి...శ్రీ చిత్రంతో ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయిన మ‌నోజ్, ద‌శ‌ర‌థ్ కాంబినేష‌న్ ఈసారి మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.