ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 థియేట‌ర్స్ లో మంచు మ‌నోజ్ శౌర్య - నిర్మాత శివ కుమార్

  • IndiaGlitz, [Thursday,February 25 2016]

మంచు మ‌నోజ్ - రెజీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించారు. సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శివ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 4న శౌర్య చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత శివ కుమార్ మాట్లాడుతూ....ఫ్యామిలీ అండ్ ల‌వ్ క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రంలో క్రైమ్ థీమ్ కూడా ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది.

సెన్సార్ బోర్డ్ ఈ సినిమాని చూసి చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగింది అంటూ మా సినిమాని ప్ర‌శంసించారు. మా సంస్థ‌లో వ‌చ్చిన గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. మ‌నోజ్ - రెజీనా పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించారు. ఇక మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే...కొత్త‌వాడైన‌ప్ప‌టికీ వేద మంచి ట్యూన్స్ అందించాడు. ఆంథ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, క‌ర్నాట‌క లో క‌లిపి దాదాపు 700 సెంట‌ర్స్ లో, ఓవ‌ర్ సీస్ లో 300 సెంట‌ర్స్ లో మొత్తం 1000 సెంట‌ర్స్ లో శౌర్య సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఖ‌చ్చితంగా మా సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌కు శౌర్య మంచి పేరు తీసుకువ‌స్తుంది అన్నారు.

More News

స‌రికొత్త సినిమా చూసామ‌నే ఫీల్ క‌లిగించే చిత్రం క్ష‌ణం - క్ష‌ణం టీమ్

భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్... మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్  బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘క్షణం’. అడవిశేష్,ఆదాశర్మ, అనసూయ భరద్వాజ. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన క్ష‌ణం చిత్రాన్నినూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించారు.

మోడీపై సినిమా చేద్దామనుకుంటున్న తెలుగు నిర్మాత...

శ్రీకాంత్,నికిత జంటగా సతీష్ కాశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం టెర్రర్.

ఫిభ్రవరి 26న విడుదలవుతున్న 'రాజుగారింట్లో 7వ రోజు'

భరత్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అజయ్‌ ప్రధానపాత్రలో భరత్‌, అర్జున్‌, వెంకటేష్‌, అక్షయ్‌, సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం'రాజుగారింట్లో7వ రోజు'.

పందెంకోడి సీక్వెల్ క్యాన్సిల్...

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి. 2005లో విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

స్టూడెంట్ గా యంగ్ టైగర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది.