ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 థియేట‌ర్స్ లో మంచు మ‌నోజ్ శౌర్య - నిర్మాత శివ కుమార్

  • IndiaGlitz, [Thursday,February 25 2016]

మంచు మ‌నోజ్ - రెజీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించారు. సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శివ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 4న శౌర్య చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత శివ కుమార్ మాట్లాడుతూ....ఫ్యామిలీ అండ్ ల‌వ్ క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రంలో క్రైమ్ థీమ్ కూడా ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది.

సెన్సార్ బోర్డ్ ఈ సినిమాని చూసి చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగింది అంటూ మా సినిమాని ప్ర‌శంసించారు. మా సంస్థ‌లో వ‌చ్చిన గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. మ‌నోజ్ - రెజీనా పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించారు. ఇక మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే...కొత్త‌వాడైన‌ప్ప‌టికీ వేద మంచి ట్యూన్స్ అందించాడు. ఆంథ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, క‌ర్నాట‌క లో క‌లిపి దాదాపు 700 సెంట‌ర్స్ లో, ఓవ‌ర్ సీస్ లో 300 సెంట‌ర్స్ లో మొత్తం 1000 సెంట‌ర్స్ లో శౌర్య సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఖ‌చ్చితంగా మా సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌కు శౌర్య మంచి పేరు తీసుకువ‌స్తుంది అన్నారు.