ప‌రువుహ‌త్య‌పై స్పందించిన హీరో మంచు మ‌నోజ్..

  • IndiaGlitz, [Monday,September 17 2018]

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప‌రువు హ‌త్యపై హీరో మంచు మ‌నోజ్ స్పందించారు. కులం పేరుతో ప్ర‌ణ‌య్ ను అతి దారుణంగా చంపిన సంగ‌తి తెలిసిందే. దీనిపై త‌న బాధ‌ను ఓ లేఖ రూపంలో తెలిపాడు మ‌నోజ్.
మాన‌వత్వం కంటే కులమ‌తాలు ఎక్కువ అని ఫీల్ అవుతున్న అంద‌రి కోస‌మే ఈ లేఖ రాస్తున్నాను అంటూ మొద‌లుపెట్టాడు మ‌నోజ్. కులగ‌జ్జి ఎక్క‌డున్నా త‌ప్పే.. ఈ రోజుల్లో హీరోల కులాలు.. రాజ‌కీయ పార్టీల్లోనూ కులాలే.. కాలేజ్ యూనియ‌న్స్ లో కులాలే.. మ‌తాలు.. వాటి సంఘాలు.. ఇలా అన్నింటితో ఈ రోజుల్లో స‌మాజం నిండిపోయింది.

ఇంత కుల‌గ‌జ్జి ఉన్న ప్ర‌తీఒక్క‌రు ప్ర‌ణ‌య్ లాంటి ఎంతోమంది అమాయ‌కుల హత్యల‌కు వాళ్లు కూడా తెలియ‌కుండా బాధ్యులే. మ‌నం ఆలోచించుకునే స‌మ‌యం కూడా వ‌చ్చేసింది. ఓ పుట్ట‌ని పసిగుడ్డు త‌న తండ్రిని కోల్పోయింది. క‌నీసం త‌న స్ప‌ర్ష కూడా లేకుండానే ఆ బేబీ ఈ భూమ్మీద‌కు రాబోతుంది. తండ్రి ఎలా ఉంటాడో తెలియ‌కుండా చేసింది ఈ స‌మాజం. మ‌నం బ‌తుకుతున్న ప్ర‌పంచం.. స‌మాజం.. మ‌న‌కు ఉన్న గుండె.. ర‌క్తం.. గాలి అంద‌రికీ ఒక్క‌టే అయిన‌పుడు కులం పేరుతో ఇలా విడ‌దీయ‌డం.. చంపుకోవ‌డం నిజంగా మంచిదేనా..?
అస‌లు దీనికి మ‌నమంతా అర్హుల‌మేనా..? బ‌త‌కనీకుండా అలా చంపేసి ఏం నేర్చుకుంటున్నాం మ‌నం..? ఈ కులం మ‌తం కాదు మ‌నమంతా ఒక్క‌టే.. అంతా మ‌నుషులమే అని ఎప్ప‌టికి తెలుసుకుంటాం.. కులాల‌ని స‌పోర్ట్ చేసే వాళ్ల‌ను చూస్తుంటే సిగ్గుప‌డండి.. ఒక్క విష‌యం మాత్రం గుర్తుంచుకోండి.. కులం పేరుతో చంపే ప్ర‌తీ ఒక్క‌రూ ఈ నేరంలో భాగం అవుతారు. ఎవ‌రో ఒక్క‌ర్ని మాత్ర‌మే ఇందులో బ్లేమ్ చేయ‌డం క‌రెక్ట్ కాదు.. అంతా దీనికి బాధ్యులే.

ఇప్ప‌టికైనా ఈ కులాన్ని మూసేయండి. ఈ కులం అనేది ఓ రోగం అని తెలుసుకుని.. క‌నీసం ఇప్ప‌టికైనా మ‌నుషుల్లా బ‌త‌కడం నేర్చుకోండి.. నా మ‌న‌సులోంచి అంద‌ర్నీ ఇది వేడుకుంటున్న మాట‌. రాబోయే త‌రానికైనా మంచి ప్ర‌పంచాన్ని ఇద్దాం. నా మ‌న‌సు ప్ర‌ణ‌య్ భార్య అమృత‌.. ఆమె కుటుంబం వైపు వెళ్తుంది. దేవుడు వాళ్ల‌కు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను.. ప్ర‌ణయ్ మ‌మ్మ‌ల్ని క్ష‌మించు.. నిన్ను కాపాడుకోలేక‌పోయినందుకు.

థ్యాంక్ యూ

మంచు మ‌నోజ్

More News

నేరుగా మార్కెట్లోకే!

స్టార్ హీరో అయిన త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాకు ఆడియో వేడుక జ‌ర‌గ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది.

క‌వ‌ల‌ల‌కు జన్మ‌నిచ్చిన మ‌హేష్ హీరోయిన్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టించిన చిత్రం 'ట‌క్కరిదొంగ‌' చిత్రంలో బిపాసాబ‌సు, లీసారేహీరోయిన్స్ న‌టించారు. ఈ ఇద్ద‌రికీ ఇప్పుడు పెళ్లైంది.

'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' రిలీజ్ డేట్‌

విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'.  అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆమీర్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్‌, రోనాల్ రాయ్‌, స‌త్య‌దేవ్ త‌దిత‌రులు

సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ ఆడియో పార్టీ..

దేవ‌దాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏసియ‌న్ గ్రూప్

యాభై సంవ‌త్స‌రాలుగా 600ల సినిమాల‌కు  ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం  డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా  నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది.