రియాకు మద్దతుగా మంచు లక్ష్మి ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం

  • IndiaGlitz, [Monday,August 31 2020]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. ఆయన మాజీ ప్రేయసి రియా చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ సమయంలో రియాకు మద్దతుగా నిలుస్తూ టాలీవుడ్ నటి, మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, రాజ్‌దీప్ సర్దేశాయికి అండగా నిలుస్తూ ఆమె ట్వీట్ చేశారు.

రియా, సర్దేశాయిల ఇంటర్వ్యూ చూసిన మంచు లక్ష్మి నిజానిజాలు తెలుసుకోకుండా వారిని ఇలా రియా చక్రవర్తిని ఇలా దూషించడం, విమర్శల పాలు చేయడం సరికాదని అన్నారు. ఆమెకు అండగా నిలవాలని కోరారు. ఇండస్ట్రీ మిత్రులు ఇప్పటికైనా మేలుకోవాలని, ఈ దూషణలు ఆపాలని పేర్కొన్నారు. కాగా మంచు లక్ష్మి ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన సుశాంత్‌కు అండగా ఉండాల్సింది పోయి రియాకు మద్దతు ఇవ్వడమేంటని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘‘నేను రియా చక్రవర్తి, రాజ్‌దీప్ సర్దేశాయిల పూర్తి ఇంటర్వ్యూ చూశాను. దీనిపై నేను స్పందించాలా.. వద్దా అని చాలా ఆలోచించాను. రియాపై మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుండటంతో చాలా మంది దీనిపై సైలెంట్‌గా ఉన్నారు. నాకు నిజమేంటో తెలియదు కానీ నిజం తెలియాలి. నిజం ధర్మ మార్గానే బయటకు వస్తుందని నేను నమ్ముతున్నా. చట్టంపై, సుశాంత్‌కి న్యాయం జరిపించేందుకు యత్నిస్తున్న ఏజెన్సీలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ అప్పటి వరకూ మనం రియాను ఆమె ఫ్యామిలీని నిజానిజాలు తెలుసుకోకుండా హింసించకూడదు. ఈ మీడియా ట్రయల్స్ కారణంగా ఆ ఫ్యామిలీ ఎంత బాధను అనుభవిస్తోందో నేను ఊహించగలను. నాకు ఇలాగే జరిగితే నా కొలీగ్స్ అంతా నా తరుఫున నిలవాలని కోరుకుంటా. అలాగే నిజానిజాలు వెలుగు చూసే వరకూ ఆమెను ఒంటరిగా వదిలేయవద్దని కోరుతున్నా. నేను నా కొలీగ్ కోసం నిలబడుతున్నా’’ అని మంచు లక్ష్మి ట్వీట్‌లో పేర్కొన్నారు.

More News

కరోనాతో మరో టాలీవుడ్ నిర్మాత మృతి

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు: మాధవీలత సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌పై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదితిరావు స్వీటెస్ట్ పర్సన్: నివేదా థామస్

హీరోయిన్ అదితిరావు హైదరీ స్వీటెస్ట్ పర్సన్ అని నివేదా థామస్ తెలిపింది. నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన ‘వి’

నిజ జీవితంలోనూ తనో మంచి ఫ్రెండ్: నివేదా

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వి’.

'మిషన్ 2020 ' ఫస్ట్ లుక్ పోస్టర్  విడుదల

శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో బన్నీ క్రియేషన్స్ మరియు మధు మృదు ఎంటర్టైన్మెంట్ స్ పతాకం పై నవీన్ చంద్ర  హీరో గా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్