ఆ న‌లుగురి క‌థే మ‌న‌మంతా - చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి

  • IndiaGlitz, [Monday,July 25 2016]

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విభిన్న‌క‌థా చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు. ఇటీవ‌ల రెండు నిమిషాల నిడివి గ‌ల ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మాట్లాడుతూ....మ‌న‌మంతా ట్రైల‌ర్ కు ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి ఆడియ‌న్స్ నుంచి చాలా మంచి స్పంద‌న ల‌భించింది. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌కు ఇదొక స్పెష‌ల్ ఫిల్మ్ అవుతుంది. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ సాయిరామ్ అనే పాత్ర పోషించారు. ఇత‌ను సూప‌ర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజ‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటారు. గౌత‌మి గాయ‌త్రి అనే మ‌ధ్యత‌ర‌గ‌తి మ‌హిళ‌గా న‌టిస్తే....విశ్వంత్ అభిరామ్ పాత్ర‌లో, రైనారావు మ‌హిత క్యారెక్ట‌ర్ చేసారు.

ఈ న‌లుగురి జీవితాల‌కు సంబంధించిన క‌థ ఇది. మిడిల్ క్లాస్ పీపుల్ ఎమోష‌న్స్ ను ఈ చిత్రంలో చూపించాం. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రాన్ని మ‌ల‌యాళంలో విస్మ‌యం అనే టైటిల్ తో, త‌మిళ్ లో న‌మ‌ధు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నాం. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి ఆగ‌ష్టు 5న రిలీజ్ చేస్తున్నాం అన్నారు.