'మనం' ను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్న దర్శకుడు...

  • IndiaGlitz, [Wednesday,May 04 2016]

అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన క్లాసిక్ మూవీ మనం తెలుగులో ఎంతటి పెద్ద విజయాన్ని సాధించింతో మనకు తెలిసిందే. తెలుగు అక్కినేని నాగేశ్వరరావు నటించిన అఖరి చిత్రం కూడా మనం. దీంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఈ సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ రీమేక్ చేయాలని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ అనుకుంటున్నారట. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సానీ ఫ్యామిలీ హీరోలతో నిర్మిస్తాడా లేక వేరే హీరోలను తెరపైకి తెస్తాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.