పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మన ఊరి రామాయణం'

  • IndiaGlitz, [Friday,June 10 2016]

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌ట‌న‌తో పాటు ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం కూడా చేస్తుంటాడ‌నే సంగ‌తి తెలిసిందే. దోని, ఉల‌చారు బిర్యాని స‌హా మ‌న‌సుకు న‌చ్చిన చిత్రాల‌ను డైరెక్ష‌న్‌తో పాటు నిర్మించిన ప్ర‌కాష్ రాజ్ ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ‌స్ట్ కాపీ పిక్చ‌ర్స్‌ పై మ‌న ఊరి రామాయ‌ణం' అనే చిత్రాన్ని నిర్మిస్తూ తెర‌కెక్కిస్తున్నాడు. ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఎడిటింగ్ పూర్తయ్యింది. ఇక రీరికార్డింగ్ పనులు స్టార్ట్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని నిర్మాత ప్రకాష్ రాజ్ స్వయంగా తెలియజేశారు.