నూజివీడులో ఇంటింటికీ సరుకులు పంచిన వ్యక్తికి కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 603. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంచిపెడుతన్నాయి. అయితే ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడులో ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంచిపెట్టిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో నూజివీడులో సరుకులు తీసుకున్న జనాలు భయపడిపోతున్నారు.

ప్రజల్లో భయం.. భయం..!

శనివారం నాడు అనుమానంతో వైద్య శిబిరంలో ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన ఆర్‌ఆర్‌పేటకు చెందిన లారీ డ్రైవర్‌ రక్త నమూనాలు ఇచ్చారు. పరీక్షల్లో పాజటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లకముందు ఓ రాజకీయ పార్టీకి చెందిన పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఆ డ్రైవర్ పాల్గొన్నాడు. అంతేకాదు.. ఆ లారీ డ్రైవర్‌ గడపగడపకూ కూరగాయలు, కోడిగుడ్లు అందించాడు. సదరు డ్రైవర్‌ స్థానిక రాజకీయ పార్టీ నాయకుని సమీప బంధువు అని తెలిసింది. లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో పట్టణ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇదిలా ఉంటే.. నూజివీడులో కరోనా కేసుల సంఖ్య 03కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో నూజివీడు రహదారులను దిగ్బంధం చేస్తున్నట్లు ప్రకటించిన సబ్‌ కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఆ లారీ డ్రైవర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు తీసుకున్న జనాల పరిస్థితేంటి..? అధికారులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? అనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More News

మహేశ్ స‌ర‌స‌న 'సాహో' బ్యూటీ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన

ఎన్టీఆర్ బ‌ర్త్ డే ట్రీట్ డౌటే!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్

జ‌క్క‌న్న‌తో మ‌హేశ్ ఫిక్స్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమానుల‌ను చాలా రోజులుగా వేధిస్తోన్న ప్ర‌శ్న‌.. త‌మ అభిమాన హీరోతో ఆల్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా ఎప్పుడు చేస్తాడు? అని. బాహుబ‌లి స‌మ‌యంలో

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌పై రాజ‌మౌళి సందేహం?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

చైత‌న్య నెక్ట్స్ ఆ ద‌ర్శ‌కుడితోనేనా..?

అక్కినేని నాగ‌చైత‌న్య సెన్సిటివ్ స‌బ్జెక్ట్స్‌ను డీల్ చేసే డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమాలో న‌టిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.