డిసెంబర్ 25న విడుదలవుతున్న 'మామ మంచు..అల్లుడు కంచు'

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం మామ మంచు..అల్లుడు కంచు'. డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ లో 23 ఏళ్ళ కిత్రం మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సిల్వర్ జూబ్లీ మూవీ అల్లరిమొగుడు' చిత్రం తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ ను క్రియేట్ చేయడానికి రెడీ అయింది. అంతే కాకుండా ఈ జనరేషన్ కామెడి స్టార్ అల్లరి నరేష్ నటించిన 50వ చిత్రం కూడా ఇదే. నరేష్ సరసన పూర్ణ హీరోయిన్ గా నటిస్తుంది.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల కోటి, అచ్చు, రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. పాటలకు శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. మోహన్ బాబు, అల్లరి నరేష్ వంటి డిఫరెంట్ కాంబినేషన్ లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నరు. క్రేజీ కాంబినేషన్ లో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

రామ్ చరణ్ న్యూమూవీ టైటిల్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ సినిమా తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

సంక్రాంతికి వచ్చేస్తానంటున్న శర్వానంద్..

యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.ఈ చిత్రంలో శర్వానంద్ సరసన సురభి హీరోయిన్ గా నటించింది.

బెంగాల్ టైగర్ మూవీ రివ్యూ

రామ్ చరణ్ తో రచ్చ వంటి సక్సెస్ తర్వాత పవన్కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తాడని అంతా ఓకే అయ్యాడని అనుకున్న తరుణంలో, సంపత్ నంది ఉన్నట్లుండి సర్దార్ గబ్బర్ సింగ్ నుండి డైరెక్టర్ గా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

జనానికి నచ్చని కథలతో సినిమా చేస్తానంటున్న రవితేజ...

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు.ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.

సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ తో విక్రమ్ కుమార్..

13బి,ఇష్క్ చిత్రాలతో విజయాలు సాధించి మూడు తరాల అక్కినేని హీరోలతో మనం సినిమాని తెరకెక్కించి ఇండస్ట్రీలో అందరి ద్రుష్టి ఆకర్షించిన డైరెక్టర్ విక్రమ్ కుమార్.