'మళ్ళీ మళ్ళీ చూశా' కి గుమ్మ‌డికాయ కొట్టిన‌ చిత్ర‌యూనిట్‌

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

అనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం మళ్ళీ మళ్ళీ చూశా.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో స‌హా అన్ని ప‌నులు పూర్తి అయిన సంద‌ర్భంగా చిత్ర యూనిట్ గుమ్మ‌డి కాయ కొట్టారు. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

చిత్ర దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ.. ''స్వేచ్ఛ లేని జీవితం అంటే శత్రువు లేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు.. సమరంలో సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రేమే గెలిపించుకుంటుంది. శత్రువులు లేని యుద్ధంలో స్వేచ్ఛగా ప్రేమను గెలిచిన సైనికుడులాంటి ఓ సామాన్యుడి ప్రేమకథ మళ్ళీ మళ్ళీ చూశా. నిర్మాత కె. కోటేశ్వరరావు పూర్తి స‌హ‌కారం అందించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు మంచి అసెట్ అవుతుంది. అలాగే న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా కోసం ప‌నిచేశారు. మంచి కంటెంట్ తో వ‌స్తోన్న సినిమా.. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఆగ‌స్ట్‌లో మీ ముందుకు రాబోతున్నాం. త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ చూడండి ''అన్నారు.

నిర్మాత కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ... '' ఒక మంచి పుస్తకం, ఒక మంచి స్నేహితుడితో సమానం. మా సినిమా కూడా చూసిన వారికి ఒక మంచి ఫ్రెండ్ అవుతుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే మన ఆలోచనలు అందంగా ఉండాలి. అలాంటి అందమైన ఆలోచనల స‌మాహార‌మే మా మళ్ళీ మళ్ళీ చూశా. మా ద‌ర్శ‌కుడు హేమంత్ కార్తీక్ సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇటీవ‌ల మా సినిమాను కొంత మంది ఇండ‌స్ట్రీ పెద్ద‌లు చూసి.. మంచి సినిమా తీశారు. అని మా టీమ్‌ను అభినందించ‌డం జ‌రిగింది. దాంతో నాకు చిత్ర‌యూనిట్ కి సినిమా విజ‌యం ప‌ట్ల కాన్ఫిడెంట్ పెరిగింది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఈ నెలలోనే మీ ముందుకు తీసుకువ‌స్తాం'' అన్నారు..

అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ, తదితరులు

More News

వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. 3జి నెట్‌వర్క్ ఔట్!

టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా తన మొత్తం 3 జి నెట్‌వర్క్‌ను మూసివేయాలని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కువ రియలైజేషన్ మరియు సగటు రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పై

‘బాహుబలి’ కంటే ముందే ‘సాహో’ ప్లాన్ చేశా కానీ...!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్ చేసేంతలా రోజురోజుకు అంచనాలు...

‘యాత్ర’ డైరెక్టర్ కొత్త సినిమా.. నిర్మాతగా పీవీపీ

‘ఆనందో బ్రహ్మ’ సినిమా కామెడీ పండించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ ఎమోషనల్‌గా టచ్ చేసిన మహి వి. రాఘవ్.. ఈ సారి ఏకంగా ‘సిండికేట్’ సినిమాతో వచ్చేస్తున్నారు.

'మిస్టర్‌ కిల్లర్‌' టీజర్‌ను విడుదల చేసిన అల్లరి నరేష్‌

రమేష్‌ స్టూడియోస్‌, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్‌ పతాకాలపై చార్లెస్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్‌ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మిస్టర్‌ కిల్లర్‌'. విశ్వ