హరితహారం లో పాల్గొన్న మజ్ను చిత్ర బృందం

  • IndiaGlitz, [Sunday,July 24 2016]
పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో మజ్ను చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం సేకరించిన వివిధ రకాల మొక్కలను చిత్ర బృందం ఈ రోజు నాటటం జరిగింది.
ఈ సందర్భం గా హీరో నాని మాట్లాడుతూ... హరితహారం అనేది చాలా మంచి ఆలోచ‌న‌. పర్యావరణాన్ని కాపాడాలని అందరూ అంటారు కానీ ఎవ్వరు పెద్దగా ఏమీ చేయరు. అందుకు భిన్నంగా ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ గారు ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించేలా ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం నిజంగా చాలా మంచి విషయం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ కార్యక్రమంలో ఉత్సాహం గా పాల్గొంటోంది. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు మొక్క‌లు నాటటం కాకుండా, మా మజ్ను చిత్ర బృందం మొత్తం కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్ణయించుకుని ఇలా చేసాం. ఎవరికి తోచిన విధంగా వారు, ఒక చిన్న చోటు ఉన్నా కూడా ఒక మొక్కను పెంచితే, ఖచ్చితం గా మంచి మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాను అన్నారు.

More News

ఆగస్ట్ 5 న 'మరల తెలుపనా ప్రియా' విడుదల

ప్రిన్స్,వ్యోమనంది,పూజా రామచంద్రన్ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం'మరల తెలుపనా ప్రియా'.ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదలకు సిద్ధమైంది.

29న 'బంతిపూల జానకి' ఆడియో!!

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు,లేదా భారీ బ్యాక్ గ్రౌండ్ గలవారు నిర్మించే సినిమాల ఆడియో వేడుకలు మాత్రమే హైద్రాబాద్, హైటెక్ సిటీకి సమీపంలో గల "శిల్ప కళా వేదిక"పై జరుగుతాయి.

రీరికార్డింగ్ దశలో ఆది 'చుట్టాలబ్బాయి'

లవ్ లీ రాక్ స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్,ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో

'కబాలి' ట్రిమ్మింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తుంది.

వెంకీ వారికి థాంక్స్ చెబుతాడట....

హీరో విక్టరీ వెంకటేష్,నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై ఎస్.నాగవంశీ నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'.