మహేష్-పూరి కాంబినేషన్లో జన గణ మన

  • IndiaGlitz, [Thursday,April 28 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన పోకిరి చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. తెలుగులో 40 కోట్ల షేర్ వ‌సూలు చేసిన మొట్ట‌మొద‌టి చిత్రంగా పోకిరి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రంతో తెలుగు సినిమా స‌త్తాను చాటి చెప్పి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు పూరి. పోకిరి త‌ర్వాత మ‌హేష్ - పూరి క‌ల‌సి చేసిన రెండో చిత్రం బిజినెస్ మేన్. ఈ చిత్రం కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించి స‌రికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. పోకిరి, బిజినెస్ మేన్ త‌ర్వాత మ‌హేష్ - పూరి క‌లిసి చేసే హ్యాట్రిక్ ఫిల్మ్ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి కానీ...ఎప్ప‌టి నుంచి సెట్స్ పైకి వెళుతుంది..? టైటిల్ ఏమిటి..? అనే విష‌యం పై మాత్రం క్లారిటీ లేదు.
అయితే...ఈరోజు పోకిరి చిత్రం రిలీజై ప‌ది సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్‌...మ‌హేష్ తో చేసే హ్యాట్రిక్ ఫిల్మ్ టైటిల్ జ‌న‌గ‌ణ‌మ‌న అని ట్విట్ట‌ర్ లో ఎనౌన్స్ చేసారు. పూరి టైటిల్ పై మ‌హేష్ స్పందిస్తూ...పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాల మ‌రో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలుస్తుందంటూ ట్వీట్ చేసారు. దేశ‌భ‌క్తిని చాటిచెప్పే టైటిల్ తో పూరి - మ‌హేష్ ల హ్యాట్రిక్ ఫిల్మ్ రాబోతుండ‌డం విశేషం.

More News

అ..ఆ రిలీజ్ డేట్

నితిన్,సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...'.త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పూరితో మూవీ గురించి నారా రోహిత్ ఏమన్నాడు..

నారా రోహిత్...సక్సెస్-ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.

'24' సెన్సార్ పూర్తి....

కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో తెలుగులో గ్లోబల్ సినిమాస్,2డి ఎంటర్ టైన్ మెంట్స్,శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'.

150 మూవీ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న చిరు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రేపు ప్రారంభం అవుతుందన్న విషయం తెలిసిందే.

క్షణం రీమేక్ లో నాగ్ హీరోయిన్..

చిన్న చిత్రంగా రిలీజైన క్షణం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.