మహేష్ బయటపడ్డాడు...

  • IndiaGlitz, [Monday,June 20 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం రిలీజైన‌ప్ప‌టి నుంచి చాలా అప్ సెట్ అయ్యాడు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బ్ర‌హ్మోత్స‌వం డిజాస్ట‌ర్ గా మార‌డంతో ఆ బాధ మ‌రిచిపోవ‌డం కోసం విదేశాలు వెళ్లాడు. బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ కి ముందు ట్విట్ట‌ర్ లో ఎక్టీవ్ గా ఉండే మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ త‌ర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వం బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు అనుకుంట‌... అందుక‌నే శ్రీమంతుడు సినిమాకి ఫిలింఫేర్ అవార్డ్ వ‌చ్చిన సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతూ మ‌ళ్లీ ట్విట్ట‌ర్ లో సంద‌డి చేసాడు మ‌హేష్. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఫిలింఫేర్ అవార్డుల‌ను మ‌హేష్ గ‌తంలో ఒక్క‌డు, పోకిరి, దూకుడు, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు చిత్రాల‌కు అందుకున్నాడు. ఇప్పుడు శ్రీమంతుడు చిత్రానికి గాను మ‌హేష్ ఫిలింఫేర్ అవార్డ్ అందుకోవ‌డం విశేషం.