Mahesh:మహేశ్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్ వచ్చేసింది.. ఈసారి లుక్ అదిరిపోయిందిగా..

  • IndiaGlitz, [Monday,December 25 2023]

సూపర్ స్టార్ మహేశ్ బాబు(MaheshBabu) ఫ్యాన్స్‌కు క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేసింది. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని 'గుంటూరు కారం(Guntur Kaaram)' నుంచి చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈసారి గత పోస్టర్ల కంటే భిన్నంగా మహేశ్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లలో మహేశ్ చేతిలో బీడీ పట్టుకునే ఉన్నాడు. తాజా పోస్టర్‌లో మాత్రం చేతిలో బీడీ లేకుండా క్లాస్‌ లుక్‌లో కనిపించాడు. బ్లాక్ షర్ట్‌లో క్లాస్ లుక్‌తో, సింపుల్ స్మైల్‌తో అభిమానులను ఆకట్టుకునేలా అదరగొట్టాడు. ముఖ్యంగా ఈ పోస్టర్ లేడీ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. దీంతో పాటు సంక్రాంతికే సినిమా పక్కా అంటూ ఈ పోస్టర్‌తో మరోసారి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

మూవీ షూటింగ్ లేట్ అవ్వడం.. పండుగకు సినిమాలు ఎక్కువ కావడంతో ఈ మూవీ పొంగల్ బరి నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా పోస్టర్‌తో ఈ వార్తలకు చెక్ పెట్టారు. కచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12న థియేటర్లలోకి రావడం పక్కా అని తేల్చిచెప్పారు. దీంతో బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వం వహిస్తుండటం, గుంటూరు కారం లాంటి మాస్ టైటిల్‌ పెట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత తమ హీరో నుంచి మాస్ చిత్రం రానుండడంతో మూవీపై హైబజ్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి.‘దమ్ బిర్యానీ’ మసాలా సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అనంతరం 'ఓ మై బేబీ' అంటూ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో ట్యూన్స్, లిరిక్స్ అసలు బాలేవు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు థమన్‌ని తెగ ట్రోల్ చేశారు. వీరి దెబ్బకు రామజోగయ్య ఏకంగా ట్విట్టర్‌ అకౌంట్ డీయాక్టివేట్ చేశాడు. మధ్యలో నిర్మాత నాగవంశీ కలుగజేసుకుని అభిమానులకు నచ్చచెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. మూవీ షూటింగ్ లేట్ కావడం.. సరైన అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో తొలి నుంచి మూవీ యూనిట్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొత్తానికి షూటింగ్ చివరి దశకు రావడం, పండుగకు విడుదల కానుండడంతో మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు.