విదేశాల్లో మ‌హేష్ ఫ్యామిలీతో చ‌ర‌ణ్..!

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవ‌ల గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన షూటింగ్ లో పాల్గొన్న మ‌హేష్ ఇప్పుడు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో క‌లిసి యూర‌ప్ వెళ్లారు. వారం రోజులు పాటు మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యూర‌ప్ లో స్పెండ్ చేయ‌నున్నారు. అయితే...ఊహించ‌ని విధంగా... ఇటీవ‌ల ధృవ సినిమాతో స‌క్సెస్ సాధించిన రామ్ చ‌ర‌ణ్ యూర‌ప్ వెళ్లాడ‌నుకుంట‌. చ‌ర‌ణ్ కూడా మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసాడు.

మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ ను చ‌ర‌ణ్ ఆత్మీయంగా ప‌ట్టుకోవ‌డం చూస్తుంటే ఎంత క్లోజ్ అయ్యారో తెలుస్తుంది. వీళ్ల‌తో పాటు మ‌హేష్ బావ గ‌ల్లా జ‌య‌దేవ్, త‌న‌యుడు అశోక్ కూడా ఉన్నారు. మ‌హేష్ ఫ్యామిలీతో చ‌ర‌ణ్ ఉన్న ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మ‌హేష్ త్వ‌ర‌గా ఎవ‌రితో క‌ల‌వ‌డు. రామ్ చ‌ర‌ణ్ తో అంత‌గా ప‌రిచ‌యం కూడా లేదు. అయితే...శ్రీమంతుడు సినిమా స‌క్సెస్ త‌ర్వాత చ‌ర‌ణ్ మ‌హేష్ కి ఫోన్ చేసి అభినందించాడ‌ట‌. ఈ విష‌యాన్ని మ‌హేష్ స్వ‌యంగా మీడియాతో చెప్పాడు. బ‌హుశా అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అయ్యిందనుకుంట‌..!