డ్రైవర్‌కు కరోనా.. మహేష్ ఫ్యామిలీ టెస్ట్ చేయించుకోగా..!

  • IndiaGlitz, [Tuesday,March 30 2021]

కరోనా సెకండ్ వేవ్ సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సీక్రెట్‌గా కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు ఫిలింనగర్‌లో టాక్ బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆయన డ్రైవర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న మహేష్ కూడా వెంటనే టెస్ట్ చేయించుకున్నట్టు తెలుస్తోంది.

మహేష్‌ బాబు తాను టెస్ట్ చేయించుకోవడమే కాకుండా గుట్టు చప్పుడు కాకుండా తన ఫ్యామిలీకి కూడా కరోనా టెస్ట్ చేయించినట్టు సమాచారం. అయితే మహేష్ సైలెంట్‌గా విషయం బయటకు రాకుండా టెస్ట్ చేయించుకోగా.. ఆయనకు నెగిటివ్ అని తేలిందని తెలుస్తోంది. తన టెస్టుకు సంబంధించిన విషయాన్ని మహేష్ చాలా సీక్రెట్‌గా ఉంచాడని ఫిలింనగర్ టాక్. తన టెస్ట్ రిజల్ట్ వచ్చిన వెంటనే తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలకు సైతం దగ్గరుండి టెస్ట్ చేయించినట్టుగా సమాచారం. అయితే వారికి కూడా నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చకున్నారని తెలుస్తోంది.

తాజాగా పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చిన్న చితకా గ్యాప్ మినహా పెద్ద పెద్ద విరామాలేమీ లేకుండా పరుశురామ్ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. తాజాగా మహేష్ డ్రైవర్‌కు పాజిటివ్ అని తేలడంతో ఎందుకైనా మంచిదని ఆయన ఈ సినిమా షూటింగ్‌కు రెండు రోజుల పాటు గ్యాప్ ఇచ్చినట్టు సమాచారం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

More News

‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ విడుదల సమయంలో ఫ్యాన్స్ బీభత్సం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.

ఎట్టకేలకు కదిలిన నౌక

సూయెజ్‌ కాలువలో కూరుకుపోయిన రాకాసి నౌక ‘ఎవర్‌ గివెన్‌’ ఎట్టకేలకు కదిలింది. సుమారు ఆరు రోజులుగా పడుతున్న కష్టానికి సోమవారం ఫలితం లభించింది.

రవితేజ 'ఖిలాడి'కి ఊహించని షాక్...

‘క్రాక్’ సినిమాలో నటించి మంచి సక్సెస్ సాధించాడు హీరో రవితేజ. తన కమ్ బ్యాక్‌కు ఈ చిత్రం అద్భుతంగా తోడ్పడింది. ప్రస్తుతం ఇదే జోష్‌తో ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నాడు.

‘విరాటపర్వం’ : సాయిపల్లవి ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో నేషనల్ స్టార్ రానా దగ్గుబాటి, సెన్సేషనల్‌ బ్యూటీ సాయిప‌ల్ల‌వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'.

'రంగ్ దే' నాల్గవ రోజు వసూళ్లివే..

నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు. ఈ సంస్థలో నితిన్ చేసిన మూడవ చిత్రమిది.